50వేల పరీక్షలు ఎన్నిరోజుల్లో చేస్తారు?:సంజయ్
ముఖ్యమంత్రి కేసీఆర్ కొండ పోచమ్మ చెరువు ప్రారంభించడం వల్ల నీళ్లు రాలేదు.. కానీ, కరోనా వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ...
హైదరాబాద్: కొండ పోచమ్మ చెరువును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడం వల్ల నీళ్లు రాలేదు గానీ, కరోనా వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ప్రారంభోత్సవ వేడుకలో భౌతిక దూరం పాటించకపోవడం వల్లే ఎమ్మెల్యేలు, అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆరోపించారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ..
‘‘రాష్ట్రంలో 50 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఎన్ని రోజుల్లో చేస్తారో స్పష్టం చేయాలి. 50 వేల పరీక్షలు చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? దిల్లీ ప్రభుత్వం చేతులెత్తేయడంతో కేంద్రం చొరవ తీసుకుంది. తెలంగాణపై కేంద్రం చొరవ తీసుకుంటే కేసీఆర్ బండారం బయట పడుతుందనే పరీక్షలు చేస్తామని ప్రకటించారు. గవర్నర్ గాంధీకి వెళ్లి పరిశీలించారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్ విడిచి రావడం లేదు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి.. అది చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ను రాష్ట్రంలో అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 245 కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేలా ఉంది’’ అని బండి సంజయ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్