ప్యాసింజర్‌ రైలుకు 24 బోగీలే ఉండాలా?

 పెళ్లిళ్ల కోసం ప్రత్యేక బోగీలు సమకూర్చే రైల్వే.. వలస కూలీల కోసం ఎందుకు ఏర్పాటు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. స్వస్థలాలకు వలస కూలీ తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిహార్‌కు చెందిన 45 మంది వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు

Published : 22 Jun 2020 18:45 IST

రైల్వేశాఖపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌: పెళ్లిళ్ల కోసం ప్రత్యేక బోగీలు సమకూర్చే రైల్వే.. వలస కూలీల కోసం ఎందుకు ఏర్పాటు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. స్వస్థలాలకు వలస కూలీ తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిహార్‌కు చెందిన 45 మంది వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారని న్యాయవాది వసుధ నాగరాజ్తెలిపారు. దీంతో బిహార్ వెళ్లే రైలుకు అదనపు బోగీ ఎందుకు ఏర్పాటు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది.

ప్యాసింజర్ రైలుకు 24 బోగీలే ఉంటాయని... అదనంగా ఏర్పాటు చేయకూడదని రైల్వే శాఖ ప్రతినిధి తెలిపారు. అదనపు బోగీని ఏర్పాటు చేయడానికి ఏ చట్టం అడ్డుకుంటోందని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్యాసింజర్ రైలుకు 25 బోగీలు ఉండకూడదనేందుకు ఏమైనా శాస్త్రీయ కారణాలున్నాయా? అని ప్రశ్నించింది. అయితే అదనపు బోగీలను రాష్ట్ర ప్రభుత్వం కోరలేదని రైల్వే శాఖ న్యాయస్థానానికి తెలిపింది. ప్రభుత్వం స్పందించకపోతే.. రైల్వేను తానే కోరతానని సీజే చౌహాన్ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ రేపు విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని