TS News : మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపట్ల తెలంగాణ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. 

Updated : 04 Dec 2021 14:36 IST

హైదరాబాద్‌ : మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపట్ల తెలంగాణ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.

రేపు మధ్యాహ్నం కోంపల్లి ఫాంహౌస్‌లో అంత్యక్రియలు..

అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రోశయ్య ఈ ఉదయం కన్నుమూశారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని అమీర్‌పేటలోని ఆయన నివాసానికి తరలించారు. రేపు ప్రజల సందర్శనార్థం గాంధీభవన్‌కు తరలించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం కోంపల్లి ఫాంహౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని