Lance Naik Sai Teja: స్వగ్రామానికి సాయితేజ పార్థివదేహం

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్‌ నాయక్‌ సాయితేజ పార్థివదేహాన్ని

Updated : 12 Dec 2021 11:09 IST

పుంగనూరు: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్‌ నాయక్‌ సాయితేజ పార్థివదేహాన్ని ఆయన స్వగ్రామం ఎగువరేగడకు తరలించారు. బెంగళూరులో సైన్యానికి చెందిన కమాండ్‌ ఆస్పత్రి నుంచి సాయితేజ భౌతికకాయాన్ని చిత్తూరు జిల్లా సరిహద్దు చీకలబైలు చెక్‌పోస్ట్‌.. వలసపల్లి మీదుగా ఎగువరేగడకు రోడ్డు మార్గంలో సుమారు 30 కి.మీ మేర భారీ ర్యాలీగా తీసుకెళ్తున్నారు. ఈ ర్యాలీలో సాయితేజ బంధువులు, స్నేహితులు, పెద్ద ఎత్తున విద్యార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సాయితేజ భౌతికకాయం ఎగువరేగడకు చేరిన అనంతరం సైనిక లాంఛనాలతో అక్కడ అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని