AP News: రాజధాని రైతులకు కౌలు ఎప్పుడు ఇస్తారు?: హైకోర్టు
రాజధాని రైతులకు మే నెలలోనే కౌలు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు ఇవ్వలేదని రైతుల తరఫున సీనియర్ న్యాయవాది మురళీధర్ హైకోర్టులో వాదనలు వినిపించారు.
అమరావతి: కౌలు చెల్లింపుపై రాజధాని రైతులు హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. ఈ ఏడాది మేలోనే రైతులకు కౌలు చెల్లించాల్సి ఉండగా, నేటి వరకూ ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కౌలు మినహా, వేరే ఆధారం లేకపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టుకు వివరించారు. గతంలో పిటిషన్ వేస్తే కేవలం పిటిషనర్ రైతుకే కౌలు ఇచ్చి, మిగతా రైతులకు ఇవ్వలేదని పేర్కొన్నారు.
దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయవాది మురళీధర్ వాదించారు. సీఆర్డీఏ, ప్రభుత్వం తరఫు న్యాయవాదులను కౌలు ఎప్పుడు ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. తాము ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో.. వచ్చే మంగళవారంలోపు ప్రభుత్వం సమాధానాలతో రావాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
Viral video: గున్న ఏనుగుకు కుటుంబమే జెడ్ క్లాస్ సెక్యూరిటీ కల్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ