KCR: కేసీఆర్ ఆరోగ్యంపై రెండో రోజు హెల్త్ బులిటెన్ విడుదల
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) క్రమంగా కోలుకుంటున్నారు.
హైదరాబాద్: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) క్రమంగా కోలుకుంటున్నారు. శుక్రవారం జరిగిన తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో.. వైద్యుల పర్యవేక్షణలో ఆయన నడవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం యశోద ఆసుపత్రి వైద్యులు రెండో రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
‘‘కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆయన్ను నిత్యం వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. బెడ్ మీద నుంచి లేచి నడవగలుగుతున్నారు. ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ నడుస్తున్నారు. ఆయన ఆరోగ్య పురోగతి పట్ల సంతృప్తిగా ఉన్నాం’’ అని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.