Karnataka: కాటేసిన తాచుపాముతో ఆసుపత్రికి..

కాటేసిన తాచుపామును పట్టుకుని ఓ వ్యక్తి ఆసుపత్రికి రావడంతో సిబ్బంది షాక్‌కు గురయ్యారు.

Published : 14 Jun 2021 18:38 IST

బళ్లారి: కాటేసిన తాచుపామును పట్టుకుని ఓ వ్యక్తి ఆసుపత్రికి రావడంతో సిబ్బంది షాక్‌కు గురయ్యారు. అతడికి ప్రాథమిక చికిత్స అందించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా ఉప్పరహళ్లి గ్రామానికి చెందిన కాడప్ప అనే వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండగా, ఓ తాచుపాము అతని ఎడమ చేతిపై కాటేసింది. వెంటనే ఆ పామును చేతితో పట్టుకుని, బంధువు సాయంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు అతనికి ప్రథమ చికిత్స నిర్వహించి జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. జిల్లా ఆసుపత్రికి కూడా పామును పట్టుకునే వెళ్లాడు. బళ్లారి ఆసుపత్రి వద్ద కొందరు ఆ పామును కొట్టి చంపారు. ప్రస్తుతం కాడప్ప ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితుని మానసిక పరిస్థితి బాగోలేనందునే పామును చేతిలో పట్టుకుని వెళ్లాడని స్థానికులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు