Nara Bhuvaneswari: తెదేపా కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన నారా భువనేశ్వరి

‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు.

Published : 07 Feb 2024 14:12 IST

ప్రత్తిపాడు: ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించారు. నియోజకవర్గ పరిధిలోని బుడంపాడులో మైలా శివయ్యయాదవ్‌, అనంతవరప్పాడులో కోటేశ్వరరావు కుటుంబాలను ఓదార్చారు. ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చొప్పున ఆర్థికసాయం చెక్కులను అందజేశారు. ఆయా కుటుంబాలకు తెదేపా అండగా ఉంటుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని