TS News: మాస్క్ ధరించకపోతే ₹1000 జరిమానా: డీహెచ్ హెచ్చరిక
కరోనా కొత్త వేరియంట్ భయాలు వెంటాడుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కొవిడ్ కట్టడి చర్యలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం
హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ భయాలు వెంటాడుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కొవిడ్ కట్టడి చర్యలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా మూడో ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనల్ని కచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. గడప దాటి బయట అడుగుపెడితే కొవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువీకరణపత్రం ఉండాలని సూచించారు. అలాగే, ఈ రోజు నుంచి మాస్క్ ధరించకపోతే ₹1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
డెల్టా రకం కంటే ఒమిక్రాన్ ఆరు రెట్లు ఎక్కువగా వ్యాపిస్తోందన్నారు. కేవలం మూడు రోజుల్లోనే మూడు నుంచి 24 దేశాలకు విస్తరించిందని గుర్తు చేశారు. కరోనా ఇంకా పూర్తిగా అంతం కాలేదన్నారు. రాష్ట్రంలో 25లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నట్టు డీహెచ్ తెలిపారు. ఇప్పటివరకు 90శాతం మందికి తొలి డోసు పూర్తి కాగా.. 47శాతం మందికి రెండు డోసులూ అందించినట్టు వివరించారు.
వైరస్ ముప్పు నుంచి మనం బయటపడేందుకు మన చేతిలో ఉన్న ఆయుధాలు కేవలం వ్యాక్సిన్.. మాస్క్లేనన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక, వ్యక్తిగత బాధ్యతతో వ్యవహరించి మాస్క్ని తప్పనిసరిగా ధరించాలన్నారు. మాస్క్ ధరించకపోతే ₹1000 జరిమానా విధించనున్నట్టు పునరుద్ఘాటించారు. అన్ని రకాల పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఈ రోజునుంచి వ్యాక్సిన్ సర్టిఫికెట్ని కూడా అధికారులు వెరిఫై చేస్తారని డీహెచ్ తెలిపారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్న ఆయన.. గతంలో కరోనా విజృంభణతో లక్షలాది మంది బాధపడ్డారని, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం