PM Modi: వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు

ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Updated : 08 May 2024 12:01 IST

వేములవాడ: ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మొక్కును చెల్లిస్తే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. ప్రధాని ఆలయ ఆవరణలో భక్తులకు అభివాదం చేశారు. ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి భాజపా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు