Pregnant: గర్భిణులకు కరోనా సోకినా.. శిశువు క్షేమమే!
కరోనాకి సంబంధించిన గర్భిణులకు అనేక భయాందోళనలు ఉన్నాయి. గర్భిణులకు కరోనా సోకితే కడుపులో బిడ్డకూ సోకుతుందా? ప్రసవం తర్వాత కరోనా సోకితే.. తల్లి పాలు తాగే శిశువులు కూడా కరోనా బారిన పడతారా వంటి అనేక సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే, తాజాగా వీటికి సమాధానం
ఇంటర్నెట్ డెస్క్: కరోనా విషయంలో గర్భిణులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గర్భిణులకు కరోనా సోకితే కడుపులో బిడ్డకూ సోకుతుందా? ప్రసవం తర్వాత కరోనా సోకితే.. తల్లి పాలు తాగే శిశువులు కూడా కరోనా బారిన పడతారా వంటి అనేక సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే, తాజాగా వీటికి సమాధానం దొరికింది. గర్భిణులకు కరోనా సోకినా.. బిడ్డకు వచ్చే ప్రమాదం ఏమీ లేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను ఇటీవల ఒక జర్నల్లో ప్రచురించారు.
కరోనా సోకిన గర్భిణులకు జన్మించిన శిశువుల్లో కరోనా జాడ లేదని, శిశువు ఆరోగ్యం.. పెరుగుదల సాధారణంగానే ఉందని పరిశోధకులు స్పష్టం చేశారు. పరిశోధనలో భాగంగా వ్యాక్సిన్ వేసుకోకముందే కరోనా బారిన పడిన కొంతమంది గర్భిణులపై ఆరు నెలలపాటు అధ్యయనం చేశారు. వారిలో 55శాతం మందికి ప్రసవం జరిగిన 10 రోజుల్లోపే కరోనా సోకింది. అయితే, వారికి జన్మించిన శిశువులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఏ ఒక్కరికీ కరోనా పాజిటివ్గా రాలేదని పరిశోధక బృందం వెల్లడించింది. వీరంతా ఈ ఏడాది ఏప్రిల్-జులై మధ్య జన్మించిన శిశువులు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిన వేళ ఇదొక ఊరటనిచ్చే విషయమని జర్నల్ సీనియర్ రచయిత, పిల్లల వైద్యురాలు, ఫీన్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ మల్లికా షా తెలిపారు.
► Read latest General News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం