జగిత్యాల జిల్లాలో ఒక్క రోజే 546 కేసులు
జగిత్యాల జిల్లాలో కరోనా మహమ్మారి బుసలు కొడుతోంది. సోమవారం ఒక్క రోజే జిల్లావ్యాప్తంగా 546 కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, ఏడుగురు వైరస్తో మృత్యువు పాలయ్యారు.
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో కరోనా మహమ్మారి బుసలు కొడుతోంది. సోమవారం ఒక్క రోజే జిల్లావ్యాప్తంగా 546 కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, ఏడుగురు వైరస్తో మృత్యువు పాలయ్యారు. గత వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా మొత్తం 3వేల మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్న కోరుట్ల, మెట్పల్లి, కొండ్రికర్ల తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ రవి సోమవారం పర్యటించారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 13 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు.
మరోవైపు పాజిటివ్ వచ్చిన వారు కచ్చితంగా గృహా నిర్బంధంలోనే ఉండాలని, సరైన వసతులు లేని వారిని కొండగట్టు జేఎన్టీయూ ఐసోలేషన్కు తరలించాలని కలెక్టర్ రవి సూచించారు. తీవ్ర అనారోగ్యం ఉన్నారని జిల్లా ఆస్పత్రికి తరలించాలని చెప్పారు. అలాగే కంటైన్మెంట్ జోన్లలో అవసరమైన వారికి నిత్యావసరాలను ఇళ్ల వద్దకు పంపించాలని పేర్కొన్నారు. కరోనా జాగ్రత్తలు, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేస్తూ మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. కొండ్రికర్ల గ్రామంలో ద్విచక్రవాహనంపై మాస్కు లేకుండా వెళ్తున్న యువకులను కలెక్టర్ స్వయంగా ఆపి రూ.1000 జరిమానా విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం