RS Praveen Kumar: పోలీసుల గృహనిర్బంధంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ గన్ పార్క్ వద్ద ఆయన సత్యాగ్రహ దీక్షను తలపెట్టారు. 

Updated : 12 Aug 2023 08:52 IST

హైదరాబాద్: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ గన్ పార్క్ వద్ద ఇవాళ ఆయన సత్యాగ్రహ దీక్షను తలపెట్టారు. ఈ క్రమంలో ప్రవీణ్‌ కుమార్‌ను కలిసి దీక్ష వివరాలు అడిగిన పోలీసులు.. అనంతరం ఇంట్లోనే నిలువరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలను ఇంట్లోకి అనుమతించడం లేదు. దీంతో ఇంట్లోనే తన దీక్షను కొనసాగిస్తానని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని వెల్లడించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని