IT Raids: రెండో రోజూ కొనసాగుతున్న ఐటీ సోదాలు.. ఆందోళన చేస్తున్న భారాస కార్యకర్తలు
ఇద్దరు భారాస ఎమ్మెల్యేల ఇళ్లల్లో, కార్యాలయాల్లో రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇందుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల ఇంటి వద్ద పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్: అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లలో రెండో రోజు కూడా ఆదాయపు పన్నుశాఖ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవి రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని ఐటీ వర్గాలు వెల్లడించాయి. ఈ సోదాల్లో దాదాపు 70 ఐటీ బృందాలు పాల్గొన్నాయి. ఐటీ సోదాలు ఎప్పటికి ముగుస్తాయో స్పష్టత లేకపోవడంతో భారాస ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనలు చేపట్టారు. రహదారిపై బైఠాయించి భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారాస ఎమ్మెల్యేలపై అక్రమంగా చేస్తున్న ఐటీ తనిఖీలను ఆపాలని డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, కొత్తపేటలోని గ్రీన్హిల్స్ కాలనీ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిలు ఇళ్లలో ఒక్కో ఇంట్లో రెండు నుంచి మూడు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వైష్ణవి గ్రూపు స్థిరాస్తి సంస్థ పేరున, హోటల్ ఎట్ హోం పేరుతో నలుగురైదుగురు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇందులో వ్యాపార లావాదేవీలకు చెందిన వివరాలకు, వీరు చెల్లిస్తున్న ఆదాయపు పన్నుకు వ్యత్యాసం ఉండడంతో రికార్డులు పరిశీలించాలని నిర్ణయించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. అయితే, ఈ రెండు సంస్థల్లో భాగస్వామ్యం కలిగిన ప్రజాప్రతినిధులు మరిన్ని వ్యాపార సంస్థల్లో పెట్టుబడి పెట్టడంతో.. ఇక్కడ వచ్చే ఆదాయాన్ని అక్కడ పెట్టుబడి పెట్టారన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు రికార్డులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. -
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
కొత్తవలస మండలంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్ లెస్ లిమిటెడ్ పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
Viral video: గున్న ఏనుగుకు కుటుంబమే జెడ్ క్లాస్ సెక్యూరిటీ కల్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!