AP News: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు కరోనా నిర్ధరణ
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయినట్లు ఏఐజీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ నెల 15న వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్గా
హైదరాబాద్: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయినట్లు ఏఐజీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ నెల 15న వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్గా తేలిందన్నారు. ప్రస్తుతం గవర్నర్ బిశ్వభూషణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. గవర్నర్ అస్వస్థతకు గురికావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు ఉదయం హైదరాబాద్కు తరలించారు. దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా తీశారు. ఏఐజీ వైద్యులతో ఫోన్లో మాట్లాడి.. గవర్నర్కు అందిస్తున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు సీఎంకు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు