శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది.

Published : 22 Jul 2021 10:58 IST

సున్నిపెంట సర్కిల్‌: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. జూరాల, సుంకేసుల, హంద్రీ జలాశయాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 50,028, సుంకేసుల నుంచి 2,215, హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తోందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. జలకళతో శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. 15,713 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 845.40 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 70.8225 టీఎంసీలుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని