HYD: వైభవంగా కొనసాగుతున్న మహాగణపతి శోభాయాత్ర

నగరంలోని ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయత్ర వైభవంగా జరుగుతోంది. భారీ ట్రాలీపై గణేశుడి ఊరేగింపు సందడిగా సాగుతోంది.

Updated : 19 Sep 2021 10:48 IST

హైదరాబాద్‌: నగరంలోని ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయత్ర వైభవంగా జరుగుతోంది. భారీ ట్రాలీపై గణేశుడి ఊరేగింపు సందడిగా సాగుతోంది. ఊరేగింపు రథంపై గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. మహా గణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిమజ్జనోత్సవాల్లో భాగంగా జీహెచ్ఎంసీ భక్తులకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తోంది. జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి మహాగణపతిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నంబర్‌ 4 వద్ద ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని