Ts News: ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తొలగిన అడ్డంకి
తెలంగాణలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. క్రమబద్దీకరణకు సంబంధించి 2106లో...
హైదరాబాద్: తెలంగాణలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. వివిధ శాఖల్లో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు 2016 ఫిబ్రవరి 6న రాష్ట్ర ప్రభుత్వం జీవో 16 జారీ చేసింది. ఒప్పంద ఉద్యోగుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కూడా ప్రారంభించింది. అయితే, జీవోను సవాల్ చేస్తూ నిరుద్యోగులు జె.శంకర్, ఎన్.గోవిందరెడ్డి 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గతంలో విచారణ జరిపిన హైకోర్టు ... జీవోపై స్టే ఇస్తూ 2017లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్టే వల్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. పిల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ తుకారాం ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. గతంలో దాఖలు చేసిన రిట్ పిటిషన్ కొట్టివేసిన విషయాన్ని పిల్లో ఎందుకు ప్రస్తావించలేదని పిటిషనర్లను హైకోర్టు తప్పుపట్టింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం