TS High Court: హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేతపై హైకోర్టు తీర్పు

హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టు తీర్పు వెలువరించింది.

Updated : 28 Oct 2021 17:22 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనలను సీజే జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ రాజశేఖరరెడ్డిల ధర్మాసనం తోసిపుచ్చింది. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిష్పక్షపాత ఎన్నికలకు నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉందని తెలిపింది. ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సీనియర్‌ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత జడ్సన్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలను ఈ సందర్భంగా హైకోర్టు కొట్టేసింది. ఉప ఎన్నిక ముగిసే వరకు హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిపేయాలని ఈ నెల 18న ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని