Train cancellation: బహనాగ వద్ద పునరుద్ధరణ పనులు.. 15 రైళ్లు రద్దు.. పూర్తి లిస్ట్ ఇదే!
Trains Cancellation: ఇటీవల బాలేశ్వర్ వద్ద రైలు దుర్ఘటన నేపథ్యంలో అక్కడ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుండటంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు జాబితాను విడుదల చేసింది.
సికింద్రాబాద్: ఇటీవల ఒడిశాలోని బాలేశ్వర్లో జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన(Odisha train accident) వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో దాదాపు 280మందికి పైగా మృతిచెందగా.. అనేకమంది గాయపడిన విషయం తెలిసిందే. ఆ మార్గంలో రైలు పట్టాలు ధ్వంసం కావడంతో బహనాగ బజార్ రైల్వే స్టేషన్ వద్ద పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ప్రమాదం తర్వాత యుద్ధప్రాతిపదికన చేపట్టిన పునరుద్ధరణ పనులతో ఇప్పటికే పలు సర్వీసులు కొనసాగుతుండగా.. హావ్డా వైపు రాకపోకలు కొనసాగించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో మొత్తంగా 15 రైళ్లు రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఈ నెల 12న చెన్నై సెంట్రల్ -షాలిమార్ (12842)రైలు సర్వీసు సేవలను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపింది.
రద్దైన రైళ్ల జాబితా ఇదే..
ఈ నెల 11న (ఆదివారం) మైసూరు- హావ్డా (22818) రైలును రద్దు చేసిన అధికారులు.. 12వ తేదీన సర్వీసులందించాల్సిన హైదరాబాద్-షాలిమార్ (18046); ఎర్నాకుళం-హావ్డా (22878), సంత్రగాచి-తంబ్రం(22841), హావ్డా-చెన్నై సెంట్రల్ (12839) రైలు సర్వీసులను రద్దు చేశారు. అలాగే, ఈ నెల 13న సంత్రగాచి-చెన్నై సెంట్రల్(22807), హావ్డా- ఎఎంవీటీ బెంగళూరు(22887), షాలిమార్-చెన్నై సెంట్రల్ (22825), షాలిమార్-హైదరాబాద్(18045), సికింద్రాబాద్-షాలిమార్(12774), హైదరాబాద్-షాలిమార్ (18046), విల్లుపురం-ఖరగ్పూర్(22604) రైలు సర్వీసులు; 14వ తేదీన సర్వీసులందించే ఎస్ఎంవీటీ బెంగళూరు-హావ్డా (22864), భాగల్పూర్ -ఎస్ఎంవీటీ బెంగళూరు(12254), షాలిమార్-సికింద్రాబాద్ (12773) సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో రాకేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. -
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
కొత్తవలస మండలంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్ లెస్ లిమిటెడ్ పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
Viral video: గున్న ఏనుగుకు కుటుంబమే జెడ్ క్లాస్ సెక్యూరిటీ కల్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!