krishna river dispute: : కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
కృష్ణా నది యాజమాన్య బోర్డ్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.
హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డ్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈమేరకు నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖను పంపించారు. శ్రీశైలంలో ఏపీ విద్యుదుత్పత్తికి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేయకుండా ఆపాలని తెలంగాణ ఈఎన్సీ కోరారు. త్రిసభ్య కమిటీ అనుమతి లేకుండా నీటి విడుదల చేయొద్దని ఆయన పేర్కొన్నారు. శ్రీశైలం, సాగర్లో గరిష్ఠ విద్యుదుత్పత్తికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. పులిచింతలలో గరిష్ఠ విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలన్నారు. ఎత్తిపోతల పథకాలు, బోర్లకు విద్యుదుత్పత్తి అవసరమని వివరించారు. కృష్ణా బేసిన్ అవసరాలకే జలాలను వినియోగించాలని సూచించారు. బేసిన్ వెలుపలకు ఏపీ ప్రభుత్వం నీటిని తరలించకుండా చూడాలన్నారు.
శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్, పులిచింతలలో తెలంగాణ విద్యుదుత్పత్తి చేపట్టడం, దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. ప్రధానమంత్రికి, కేంద్ర జల్శక్తి మంత్రికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పరిస్థితి వివరిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇటీవల లేఖ రాసింది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై కొద్ది రోజులు క్రితం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ లేఖ రాయగా, నిలిపివేయాలని బోర్డు తెలంగాణకు లేఖ రాసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం