krishna river dispute: : కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

కృష్ణా నది యాజమాన్య బోర్డ్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.

Updated : 29 Jul 2021 13:33 IST

హైదరాబాద్‌: కృష్ణా నది యాజమాన్య బోర్డ్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈమేరకు నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖను పంపించారు. శ్రీశైలంలో ఏపీ విద్యుదుత్పత్తికి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేయకుండా ఆపాలని తెలంగాణ ఈఎన్‌సీ  కోరారు. త్రిసభ్య కమిటీ అనుమతి లేకుండా నీటి విడుదల చేయొద్దని ఆయన పేర్కొన్నారు. శ్రీశైలం, సాగర్‌లో గరిష్ఠ విద్యుదుత్పత్తికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. పులిచింతలలో గరిష్ఠ విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలన్నారు. ఎత్తిపోతల పథకాలు, బోర్లకు విద్యుదుత్పత్తి అవసరమని వివరించారు. కృష్ణా బేసిన్‌ అవసరాలకే జలాలను వినియోగించాలని సూచించారు. బేసిన్‌ వెలుపలకు ఏపీ ప్రభుత్వం నీటిని తరలించకుండా చూడాలన్నారు.

శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్‌, పులిచింతలలో తెలంగాణ విద్యుదుత్పత్తి చేపట్టడం, దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌.. ప్రధానమంత్రికి, కేంద్ర జల్‌శక్తి మంత్రికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పరిస్థితి వివరిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇటీవల లేఖ రాసింది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై కొద్ది రోజులు క్రితం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ లేఖ రాయగా, నిలిపివేయాలని బోర్డు తెలంగాణకు లేఖ రాసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని