వీహెచ్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య పరామర్శ

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు(వీహెచ్‌)ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Updated : 12 Jul 2021 11:46 IST

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు(వీహెచ్‌)ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్‌కు ఆయన ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సలహాలను పాటించి కోలుకోవాలని సూచించారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. తనను గుర్తు పెట్టుకొని పరామర్శించిన వెంకయ్యకు వీహెచ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఉప రాష్ట్రపతి పరామర్శతో తనకు ఉత్సాహం వచ్చిందని చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని