Jammu and Kashmir: ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్నాగ్ జిల్లా షాదిపొరా ప్రాంతంలో శనివారం జరిగిన ఎదరుకాల్పుల్లో......
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్నాగ్ జిల్లా షాదీపొరా ప్రాంతంలో శనివారం జరిగిన ఎదరుకాల్పుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్ఎం)కి చెందిన ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. మరణించిన ఉగ్రవాదులను ఇష్ఫిక్ గనీ, వాయార్ ఆయుబ్దార్గా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరిద్దరూ అనేక ఉగ్రవాద నేరాలకు పాల్పడ్డారని కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ తెలిపారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎన్కౌంటర్ అనంతరం పోలీసులు, భద్రతా బలగాలు అక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్