వారి మరణాలపై సమాచారం లేదు: కేంద్రం
కరోనావైరస్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ సమయంలో చోటుచేసుకున్న వలసకార్మికుల మరణాలకు సంబంధించి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని కేంద్రం సోమవారం వెల్లడించింది.
పార్లమెంటులో కేంద్రం సమాధానం
దిల్లీ: కరోనావైరస్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ సమయంలో చోటు చేసుకున్న వలస కార్మికుల మరణాలకు సంబంధించి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని కేంద్రం సోమవారం వెల్లడించింది. ఆ సమాచారం లేనందున పరిహారం అందించే అవకాశం కూడా లేదని తెలిపింది. వైరస్కు ప్రారంభ దశలోనే అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తరుణంలో లోక్సభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆ సమాధానమిచ్చింది.
అలాగే లాక్డౌన్ సమయంలో వలస కార్మికులకు ఎదురైన సమస్యలను అంచనా వేయడంలో కేంద్రం విఫలమైందన్న విమర్శపై మరో కేంద్ర మంత్రి సంతోశ్ కుమార్ గంగ్వార్ స్పందించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఎన్జీఓలు, స్వయం సహాయ బృందాలు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కొవిడ్ను కట్టడి చేసేందుకు లాక్డౌన్ సమయంలో కలిసికట్టుగా పోరాటం చేశారన్నారు.
కాగా, కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. 1.04 కోట్ల మంది కార్మికులు లాక్డౌన్ సమయంలో వారి సొంత రాష్ట్రాలకు తరలివెళ్లారు. ఈ క్రమంలో కొందరు రోడ్డు మార్గంలో, రైళ్ల పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్తూ..ప్రమాదాల బారిన పడి మరణించారు. దాంతో కేంద్రం వారిని తరలించడానికి ప్రత్యేక శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది. -
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
తనపై వచ్చిన ఓ మీమ్ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..