మా టీకా సామర్థ్యం..79శాతం
తమ కరోనా వైరస్ టీకా 79శాతం ప్రభావంతంగా పనిచేస్తోందని బుధవారం చైనాకు చెందిన ఔషధ సంస్థ సినోఫార్మ్ వెల్లడించింది.
మొదటిసారి టీకా సామర్థ్యంపై చైనా సమాచారం
బీజింగ్: తమ కరోనా వైరస్ టీకా 79శాతం ప్రభావంతంగా పనిచేస్తోందని బుధవారం చైనాకు చెందిన ఔషధ సంస్థ సినోఫార్మ్ వెల్లడించింది. ఆ సంస్థ అభివృద్ధి చేసిన టీకా ఫేజ్-3 ట్రయల్స్లో ఈ విషయం వెల్లడైంది. పశ్చిమ దేశాలకు పోటీగా టీకా తయారీలో చైనా దూకుడు ప్రదర్శించింది. అక్కడ ప్రస్తుతం ఐదు టీకాలు ఫేజ్-3 ట్రయల్స్ కొనసాగుతున్నాయి. అయితే పోటీ సంస్థలైన ఫైజర్, మోడెర్నాలతో పోల్చుకుంటే ఈ టీకా సమర్థత తక్కువగా ఉండటం గమనార్హం.
‘కొవిడ్-19 కట్టడి విషయంలో మా టీకా సామర్థ్యం 79.34 శాతంగా ఉంది’ అని సినోఫార్మ్ అనుబంధంగా పనిచేస్తోన్న బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ వెల్లడించింది. ఈ టీకా అనుమతుల కోసం చైనా ఔషధ నియంత్రణ సంస్థకు సినోఫార్మ్ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. తొలిసారిగా బుధవారమే టీకా సామర్థ్యం గురించిన వివరాలను ఆ దేశం అందించింది.
అయితే, ట్రయల్స్ సమాచారంపై పారదర్శకత లేకపోవడంతో చైనా టీకాపై అంతర్జాతీయ సమాజం అనుమానం వ్యక్తం చేసింది. తన టీకాపై నమ్మకాన్ని కూడబెట్టుకోవడానికి కమ్యూనిస్ట్ దేశం చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. టీకా వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, దాని భద్రత గురించి ఆ దేశ అధికారులు ప్రజలకు పదేపదే చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఇదిలా ఉండగా..ఆ దేశ టీకాకు ఇంతవరకు ఔషద సంస్థ అనుమతి ఇవ్వలేదు. అయినా అత్యవసర వినియోగం కింద ఇప్పటికే 10లక్షల మందికి పైగా అందించారు. అలాగే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ నెల ప్రారంభంలో సినోఫార్మ్ టీకాకు అనుమతి ఇచ్చింది. దీంతో చైనా టీకాను ఆమోదించిన మొదటి విదేశీ దేశంగా నిలిచింది. అంతేకాకుండా ట్రయల్స్ తాత్కాలిక ఫలితాల్లో 86 శాతం సమర్థంగా పనిచేసిందని తెలపడం గమనార్హం. మరోవైపు ఆసియాకు చెందిన పేద దేశాలకు సరసమైన ధరతో ఈ టీకాను అందిస్తామని బీజింగ్ ఇప్పటికే వాగ్దానమూ చేసింది.
ఇవీ చదవండి:
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.