ప్రణబ్‌ముఖర్జీకి శస్త్రచికిత్స 

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి బ్రెయిన్‌ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసినట్టు ఆర్‌ అండ్‌ ఆర్‌ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. .....

Published : 11 Aug 2020 02:16 IST

దిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి బ్రెయిన్‌ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసినట్టు ఆర్‌ అండ్‌ ఆర్‌ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సోమవారం కరోనా పాజిటివ్‌గా తేలిన అనంతరం ప్రణబ్‌ ముఖర్జీ ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయన బ్రెయిన్‌కు శస్త్రచికిత్స చేసినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రణబ్‌ ముఖర్జీకి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం 84 ఏళ్ల వయస్సు ఉన్న ప్రణబ్‌ ముఖర్జీ తనకు కొవిడ్‌ సోకిన విషయాన్ని ఈ మధ్యాహ్నం స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. ఈ వారం రోజుల్లో తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని