ప్రణబ్ దాదా.. రాజకీయ కాళిదాసు!
దేశ రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను చూసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటరీ వ్యవస్థనే ఔపోసన పట్టిన అపర చాణుక్యుడు. రాజకీయాల్లో ఆకాశ పాతాళాలను చవి చూసిన వాస్తవికవాది. చరిత్ర పుటలను నాలుక కొసన.......
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను చూసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మనకు ఇకలేరు. పార్లమెంటరీ వ్యవస్థనే ఔపోసన పట్టిన అపర చాణుక్యుడైన ప్రణబ్ దాదా సోమవారం సాయంత్రం దిల్లీలోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజకీయాల్లో ఆకాశ పాతాళాలను చవి చూసిన వాస్తవికవాది ఆయన. చరిత్ర పుటలను నాలుక కొసన పెట్టుకున్న రాజకీయ కాళిదాసు. ఏ అంశం మీదైనా అనర్గళంగా ప్రసంగించగలిన వాచస్పతి. మంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించడమే కాదు.. తెరవెనక మంత్రాంగం నెరపడంలోనూ సిద్ధహస్తుడు. సంక్షోభ సమయంలో చిక్కుముడులను అవలీలగా విప్పే నేర్పరి. చాణక్యం, హాస్య చాతుర్యం, గాంభీర్యం, ఆగ్రహం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రదర్శించాలో తెలిసిన ప్రణబ్ ముఖర్జీ జీవిత ప్రస్థానంలోని విశేషాలు..
సంక్షోభ పరిష్కర్త
పార్టీలోనూ, పార్లమెంట్ వ్యవహారాల్లోనూ సంక్షోభాలు తలెత్తినప్పుడల్లా కాంగ్రెస్ అధిష్ఠానానికి ముందు గుర్తొచ్చేది ప్రణబ్ ముఖర్జీనే. రాజీవ్ మరణానంతరం అప్పట్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరి.. తుదిశ్వాస వరకు ఆ పదవిలో కొనసాగాలన్న పట్టుదలతో ఉన్నప్పుడు ఆయన్ను తప్పించే బాధ్యత సోనియా.. ప్రణబ్కే అప్పగించారు. 1988 మార్చి 14న ప్రణబ్ తన నివాసంలో చాణక్యం ప్రదర్శించి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు.
* ఆ తర్వాత ఏడాది సోనియా విదేశీయత అంశాన్ని లేవనెత్తిన శరద్ పవార్, తారిఖ్ అన్వర్, పీఏ సంగ్మాలను ఎదుర్కొనే బాధ్యతనూ మళ్లీ ప్రణబ్కే అప్పగించారు. ఈ పనినీ సమర్థంగా నిర్వర్తించారు. ఆ సమయంలో సోనియా లేఖలను రూపొందించింది కూడా ప్రణబ్ అనే చెబుతారు.
* విపక్షాల నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలు స్తంభించినప్పుడు ఎన్నోసార్లు వారితో మాట్లాడి రాజీకి ఒప్పించిన నేర్పరి. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి యూపీఏ భాగస్వామ్య పక్షాలతో తలనొప్పులు వచ్చినప్పుడూ ఆయనే మధ్యవర్తి.
ఇందిరకు విశ్వాసపాత్రుడు
2004, 2009 ప్రత్యక్ష ఎన్నికల్లో తప్పించి ప్రణబ్ ఎప్పుడూ లోక్సభకు ఎన్నికకాలేదు. అయినా ఇందిరాగాంధీ ఆయనకు ఎన్నో కీలక బాధ్యతలు అప్పజెప్పారు. తన గైర్హాజరులో మంత్రివర్గ సమావేశాలకు మిగిలిన వారి కంటే జూనియర్ అయిన ప్రణబ్కే అధ్యక్షత వహించే అవకాశం కల్పించేవారు.
రాజీవ్తో విభేదాలు
ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన పరిణామాలు రాజీవ్ గాంధీకి ప్రణబ్ను దూరం చేశాయి. ఇందిర హత్య సమయంలో రాజీవ్, ప్రణబ్ బెంగాల్లో ప్రచార కార్యక్రమంలో ఉన్నారు. తాత్కాలిక ప్రధాని ఎవరవుతారు అని రాజీవ్.. ప్రణబ్ను అడిగితే అత్యంత సీనియర్ మంత్రి ఆ బాధ్యతలు చేపడతారని, నెహ్రూ, లాల్బహదూర్ శాస్త్రి మరణానంతరం అదే జరిగిందని ప్రణబ్ అన్నట్టు చెబుతారు. అప్పటికి ప్రణబ్ ముఖర్జీయే సీనియర్ మంత్రి. ఇది రాజీవ్ ఆగ్రహానికి కారణమైందని చెబుతారు. తర్వాత కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా ప్రణబ్ హోదాను తగ్గిస్తూ ఆయన్ను బెంగాల్ పీసీసీ అధ్యక్షుడిగా రాజీవ్ నియమించడంతో కినుక వహించి 1986లో రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ను స్థాపించారు. అప్పట్లో రాజీవ్ ఆయన్ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు కూడా. 1987లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ పేరుపై పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. ఆ తర్వాత కూడా మునుపటి ప్రాధాన్యం లభించలేదు. పీవీ నరసింహారావు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత మళ్లీ పూర్వ వైభవం సాధ్యమైంది.
మరోసారి చేజారిన ప్రధాని అవకాశం
రాజీవ్ దుర్మరణంతో పీవీ నరసింహారావు కాంగ్రెస్ నాయకత్వం చేపట్టి ప్రధాని అయ్యారు. వాస్తవానికి పీవీ కంటే ప్రణబ్ ముఖర్జీయే సీనియర్. అయితే, అంతకముందు పార్టీ వీడి మళ్లీ చేరడంతో సాంకేతికంగా కొత్త నేత అయ్యారు. దీంతో ప్రధాని పదవి చేపట్టడానికి పార్టీ పరంగా అనర్హులయ్యారు. సోనియా గాంధీ రాజకీయాల్లోకి రావడానికి అంగీకరించిన తర్వాత ప్రణబ్ ఆమె కోటరీలో కీలక వ్యక్తిగా అవతరించారు. కఠిన సమయాల్లో సముచిత సలహాలిస్తూ అధిష్ఠానానికి విధేయుడిగా మెలిగారు ప్రణబ్.
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థికమంత్రిగా..!
47 ఏళ్ల వయస్సులో తొలిసారి పెద్ద ఆఖ అయిన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టి.. ఆర్థికశాఖను పిన్న వయస్సులో చేపట్టిన మంత్రిగా ప్రణబ్ పేరు పొందారు. 1984లో యూరోమని మ్యాగజీన్ నిర్వహించిన ఓ సర్వేలో ప్రణబ్.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థికమంత్రిగా ఎంపికయ్యారు. ప్రణబ్ కార్యదక్షత దేశీయ వ్యవహారాలకే పరిమితం కాదు. అణుఒప్పందం వ్యవహారంలో అంతర్జాతీయంగా ఎటువంటి ఒడిదొడుకులు రాకుండా అమెరికా అధ్యక్షుడితో మంతనాలు జరిపిన సమర్థత ఆయనది.
ఇదీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
హసనకు చెందిన జేడీఎస్ మహిళ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. -
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
ఇజ్రాయెల్, ఇరాన్లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయని, ఆ దేశాలకు ప్రయాణించేటప్పుడు భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది. -
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
లోక్సభ ఎన్నికల వేళ.. ఒడిశాకు చెందిన ఒక ఉన్నతాధికారిణిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
దేశ రాజధానిలో ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. -
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
పశ్చిమ్ బెంగాల్ గవర్నర్పై ఒక యువతి చేసిన ఆరోపణలపై సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా మండిపడ్డారు. -
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
Supreme Court: ఒకే రకమైన పేర్లు ఉన్నంతమాత్రాన వారిని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా తాము నిలువరించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. దీనిపై దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది. -
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. -
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
మహిళలపై లైంగిక వేధింపులు, అపహరణల అంశానికి సంబంధించి హెచ్డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్పై కేసులు నమోదయ్యాయి. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు