శ్రీనగర్‌లో ఇద్దరు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతూనే ఉన్నాయి. శ్రీనగర్‌ శివారులోని రణ్‌బీర్‌గఢ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న...

Published : 25 Jul 2020 11:26 IST

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతూనే ఉన్నాయి. శ్రీనగర్‌ శివారులోని రణ్‌బీర్‌గఢ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గాలింపు చేపట్టిన భద్రతాదళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. గాలింపు చర్యల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా..భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఆ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని