Vaccine: జాన్సన్ టీకాతో అరుదైన సమస్య!
ప్రముఖ ఔషధ తయారీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించిన సింగిల్ డోసు కరోనా టీకాకు మరోసారి చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ టీకా తీసుకున్న వారిలో చాలా అరుదుగా నరాలపై రోగనిరోధక వ్యవస్...
వాషింగ్టన్: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించిన సింగిల్ డోసు కరోనా టీకాకు మరోసారి చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ టీకా తీసుకున్న వారిలో చాలా అరుదుగా నరాలపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ టీకా వినియోగానికి సంబంధించిన అనుమతుల పత్రంలో హెచ్చరికను జోడిస్తున్నామని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఈ దుష్ప్రభావాన్ని గిలియన్-బారే సిండ్రోమ్గా పేర్కొంటారని నిపుణులు తెలిపారు. ఇప్పటి వరకు అమెరికాలో 12.8 మిలియన్ల మందికి జాన్సన్ టీకా ఇవ్వగా.. 100 కేసుల్లో ఈ దుష్ప్రభావం తలెత్తినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎఫ్డీఏ తెలిపింది. వీరిలో 95 శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది. ఒకరు మరణించినట్లు వెల్లడించింది. టీకా తీసుకున్న 42 రోజుల్లోపు ఈ దుష్ప్రభావం వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఈ సమస్య తలెత్తినట్లు పేర్కొంది.
సాధారణంగా ఏటా సీజనల్ ఫ్లూ, పుండ్లకు సంబంధించిన టీకాలు తీసుకున్న వారిలో 3000-6000 మందిలో గిలియన్-బారే సిండ్రోమ్ను గుర్తిస్తామని ఎఫ్డీఏ తెలిపింది. వీరిలో చాలా మంది కోలుకుంటారని పేర్కొంది. దీని వల్ల కండరాల్లో బలహీనతతో మొదలై పక్షవాతం వరకు దారితీసే ప్రమాదం ఉందని తెలిపింది.
అయినప్పటికీ.. జాన్సన్ అండ్ జాన్సన్ సహా ఇతర కరోనా టీకాలను తీసుకోవడం మాత్రం మానొద్దని అమెరికా సీడీసీ స్పష్టం చేసింది. తాజాగా గుర్తించిన దుష్ప్రభావం చాలా అరుదని తెలిపింది. జాన్సన్ టీకా వల్ల తలెత్తే సమస్యలతో పోలిస్తే ప్రయోజనాలే అధికమని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
పెళ్లై నెల కాకముందే భర్త మృతి.. కొత్త జంటను వేరుచేసిన రైలు ప్రమాదం
-
Ap-top-news News
లింగమనేని రమేష్ ఇల్లు జప్తుపై నిర్ణయానికి అనిశా కోర్టు నిరాకరణ
-
Crime News
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని యువకుడికి నోటీసు.. మఫ్టీలో పులివెందుల పోలీసులు
-
India News
Secunderabad-Agartala Express: సికింద్రాబాద్ - అగర్తలా రైలులో షార్ట్ సర్క్యూట్
-
Ap-top-news News
Viveka Murder Case: ‘భాస్కరరెడ్డి బయట ఉంటే సాక్షులెవరూ ముందుకు రారు’
-
Ap-top-news News
Vijayawada: 9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు