Anand Mahindra: సవాళ్లకే ఆమె సవాల్.. మహిళా ఆటోడ్రైవర్పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన ట్విటర్లో మరో స్ఫూర్తిదాయక గాథను పంచుకున్నారు. తన పిల్లలను పెంచేందుకు ఆటో డ్రైవర్గా మారిన ఓ పంజాబీ మహిళను కొనియాడారు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra).. ఎప్పటికప్పుడు సందేశాత్మక, స్ఫూర్తిదాయక విషయాలను పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల ఓ పంజాబీ మహిళ స్ఫూర్తి గాథను పంచుకున్నారు. పిల్లలను చదివించడం కోసం ఆటోడ్రైవర్గా మారిన ఆ మహిళ ఎంతోమందికి ఆదర్శమని కొనియాడారు.
‘‘పరమ్జిత్ కౌర్.. పంజాబ్లో మా మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసిన తొలి మహిళా కస్టమర్. భర్తను కోల్పోయిన తర్వాత ఆమె తన ఇంటికి మూలాధారమయ్యారు. తన కుమార్తెల్లో ఒకరు ఇప్పుడు కాలేజీలో చదువుతున్నారు. పిల్లలను పెంచి పెద్ద చేసేందుకు మా ‘ఇ ఆల్ఫా మినీ(ఎలక్ట్రిక్ ఆటో)’ ఆమెకు భరోసాగా మారింది. సవాళ్లను అధిగమించి ఎలా ఎదగాలో ఆమె నిరూపించారు’’ అని ఆనంద్ మహీంద్రా ట్విటర్లో రాసుకొచ్చారు. ఆమె ఫొటోను కూడా జత చేశారు.
ఈ పోస్ట్కు నెట్టింట పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. ‘‘సమస్యలతో సతమతమవుతున్న ఎంతోమందికి ఆమె ఆదర్శం. ఆత్మవిశ్వాసంతో ఆమె జీవితంలో ముందుకెళ్తోంది’’ అని ఓ నెటిజన్ అభినందించారు. ‘‘ప్రతికూలతలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా జీవితంతో పోరాడుతున్న ఆమెకు సెల్యూట్. అద్భుతం’ అని మరికొందరు ఆమెను కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని