CBSE Class 12 Results: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది.
దిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్సైట్(cbseresults.nic.in లేదా cbse.gov.in) ద్వారా వీక్షించవచ్చు. దాంతో పాటు digilocker.gov.in, డిజిలాకర్ యాప్లో ఫలితాలను చూసుకునే వెసులుబాటు కల్పించారు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్ నంబర్తో పాటు స్కూల్ నంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
99.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత
కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పరీక్షలు రద్దుచేయడంతో మెరిట్ లిస్ట్ను ప్రకటించలేదు. DigiLockerలో స్కోర్ కార్డును పొందవచ్చు. ఈ ఏడాది 13,04,561 మంది ఫలితాలను బోర్డు వెల్లడించగా.. రికార్డు స్థాయిలో 99.37శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. అలాగే, దిల్లీలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 99.84శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపింది. మొత్తంగా 70,004మంది విద్యార్థులు 95శాతం మార్కులు సాధించగా.. 1,50,152మంది విద్యార్థులు 90శాతం పైగా మార్కులు సాధించినట్టు బోర్డు వెల్లడించింది. ఇకపోతే, కేంద్రీయ విద్యాలయాలు (కేవీ), సీటీఎస్ఏ పాఠశాలల్లో విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొంది. ఇంకా 65184 మంది విద్యార్థుల ఫలితాలు వెయింటింగ్లో ఉన్నాయని, వారి ఫలితాలను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్టు సీబీఎస్ఈ అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం 10.59శాతం పెరిగినట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది. -
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
తనపై వచ్చిన ఓ మీమ్ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..