Vaccination: సిరంజీల ఎగుమతులపై పరిమితులు.. వ్యాక్సినేషన్ను ముమ్మరం చేసేందుకే!
దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి మూడు నెలలపాటు మూడు రకాల సిరంజీల ఎగుమతులపై పరిమితులు విధించింది. ఈ విషయమై...
దిల్లీ: దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి మూడు నెలలపాటు మూడు రకాల సిరంజీల ఎగుమతులపై పరిమితులు విధించింది. ఈ విషయమై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ‘అంత్యోదయ’ ఆశయ సాధనలో భాగంగా, దేశంలో అర్హులందరికీ వ్యాక్సిన్ అందిస్తామన్న హామీ నెరవేర్చే క్రమంలో.. దేశంలో సిరంజీల లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ సమయంలో టీకా ప్రక్రియ పూర్తి చేయడానికి, ఈ కార్యక్రమ వేగాన్ని కొనసాగించడానికి సిరంజీల లభ్యత చాలా అవసరం’ అని పేర్కొంది. 0.5 ఎంఎల్/1 ఎంఎల్ ఆటో డిసేబుల్, 0.5 ఎంఎల్/1 ఎంఎల్/ 2 ఎంఎల్/ 3 ఎంఎల్ డిస్పోజబుల్, 1 ఎంఎల్/2 ఎంఎల్/3 ఎంఎల్ రీ యూజ్ ప్రివెన్షన్ సిరంజీలపై ఈ పరిమితులు కొనసాగుతాయని చెప్పింది. ఇతర సిరంజీలపై ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది.
మరోవైపు శనివారం మధ్యాహ్నం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 94 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేశారు. ఇందులో 67.80 కోట్లకుపైగా ఫస్ట్ డోసులు కాగ, 26.26 కోట్ల మందికి రెండు డోసులూ పూర్తయ్యాయి. దసరా(అక్టోబరు 15)లోపే వంద కోట్ల మార్క్ను అందుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?