
VPN Network: నిబంధనలు పాటించండి.. లేదంటే భారత్ నుంచి వెళ్లిపోండి
వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్ర ఐటీశాఖ స్పష్టం
దిల్లీ: భారత్ రూపొందించిన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఆయా సంస్థలు నడుచుకోవాల్సిందేనని కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఒకవేళ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు లేదా ఇతర వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్లు నూతన మార్గదర్శకాలను పాటించకుంటే దేశం నుంచి నిష్క్రమించడం తప్ప వారికి మరోమార్గం లేదని తేల్చిచెప్పారు. సైబర్ ఉల్లంఘనల నమోదుపై ఇటీవల రూపొందించిన మార్గదర్శకాలపై తరచూ అడిగే ప్రశ్నలను విడుదల చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించారు.
‘భారత్లో నిబంధనలు, చట్టాలను పాటించలేమని చెప్పడానికి ఎవ్వరికీ అవకాశం లేదు. ఇప్పటివరకు లాగ్ రికార్డులు లేకుంటే.. వాటిని ఇకనుంచి మొదలుపెట్టండి. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మార్గదర్శకాలు పాటించలేమని కోరుకునేవారు ఒకవేళ భారత్ నుంచి వెళ్లిపోవాలనుకుంటే నిరభ్యంతరంగా నిష్క్రమించవచ్చు’ అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ నిబంధనల్లో ప్రభుత్వం ఎటువంటి మార్పుచేయదని స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు, వీపీఎన్ సంస్థలు, డేటా సెంటర్లు యూజర్ డేటాను ఐదేళ్లపాటు భద్రపరచడం తప్పనిసరి చేస్తూ ఇటీవల ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) నిబంధనలు జారీ చేసింది. అంతేకాకుండా సైబర్ దాడులకు సంబంధించిన ఘటనలను గుర్తించిన ఆరు గంటల్లోపే వాటి వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. అయితే, వీటిని వ్యతిరేకిస్తోన్న కొన్ని వీపీఎన్ కంపెనీలు.. ఈ కొత్త నిబంధనలు సమాచార భద్రతలో లొసుగులకు దారితీస్తాయని వాదిస్తున్నాయి. ఇదే విషయంపై గూగుల్, ఫేస్బుక్, ఐబీఎం, సీస్కో వంటి టెక్ దిగ్గజ సంస్థలు సభ్యులుగా ఉన్న అమెరికాకు చెందిన ఐటీఐ కూడా మార్గదర్శకాలను పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ నేపథ్యంలోనే సైబర్ సెక్యూరిటీ నిబంధనలు ఎట్టిపరిస్థితుల్లో మార్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Road Accident: ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సు-లారీ ఢీ: ఒకరు మృతి, 20 మందికి గాయాలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
-
World News
Senegal: సమద్రంలో బోటు బోల్తా.. 13 మంది మృతి, 40మంది గల్లంతు!
-
India News
Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
-
India News
Jammu: జమ్మూలో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Sports News
Hanuma vihari : మన దగ్గర పోటీ ఎక్కువ.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు సిద్ధమే: హనుమ విహారి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- కథ మారింది..!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!