Viral news: అమ్మ ఇక లేదని తెలియక.. ఒడిలో ఆదమరిచి నిద్రపోయి..
రైల్వే ప్లాట్ఫాంపై కన్నతల్లి చనిపోయింది. ఆ విషయం తెలియని అయిదేళ్ల కుమారుడు.. అమ్మ మెడ చుట్టూ చేతులు వేసుకుని ఒడిలో పడుకుని ఆదమరిచి నిద్రపోయాడు. ఆ తర్వాత కాసేపటికి మెలకువ వచ్చాక ‘అమ్మా.. ఆకలేస్తోంది’
బిహార్ రైల్వే స్టేషన్లో హృదాయవిదారక ఘటన
భాగల్పుర్: రైల్వే ప్లాట్ఫాంపై కన్నతల్లి చనిపోయింది. ఆ విషయం తెలియని అయిదేళ్ల కుమారుడు.. అమ్మ మెడ చుట్టూ చేతులు వేసుకుని ఒడిలో పడుకుని ఆదమరిచి నిద్రపోయాడు. ఆ తర్వాత కాసేపటికి మెలకువ వచ్చాక ‘అమ్మా.. ఆకలేస్తోంది’ అంటూ ఆమెను లేపే ప్రయత్నం చేశాడు. ఎంతకీ నిద్రలేవకపోయేసరికి ఏం జరిగిందో అర్థం కాక గట్టిగా రోదించడం మొదలుపెట్టాడు. ఈ హృదాయవిదారక ఘటన బిహార్లోని భాగల్పుర్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఈ ఘటన చోటుచేసుకోగా ప్రయాణికులు సమచారమివ్వడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతురాలి వివరాలు తెలుసుకోవడానికి తల్లీకుమారుడి ఫొటోలను పట్టణంలోని కూడళ్లలో అంటించారు. ఎవరూ సంప్రదించకపోవడంతో గురువారం పోలీసులే అంత్యక్రియలు చేశారు. చిన్నారిని శిశు సంరక్షణ కేంద్ర అధికారులకు అప్పగించారు. మృతురాలికి పోస్ట్మార్టం నిర్వహించామని, నివేదిక వచ్చాకే ఆమె మరణానికి కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?