Telegram: వెయ్యి మంది వీక్షకులతో గ్రూప్ వీడియో కాల్
మెసేజింగ్ వేదిక ‘టెలిగ్రామ్’ సరికొత్త హంగులను జోడించింది. ప్రధానంగా వీడియో కమ్యూనికేషన్పై దృష్టి సారించింది. జూన్లోనే గ్రూప్ వీడియో కాల్స్ను ఈ సంస్థ అందుబాటులోకి తెచ్చింది.
కొత్త హంగులను జోడించిన ‘టెలిగ్రామ్’
వాషింగ్టన్: మెసేజింగ్ వేదిక ‘టెలిగ్రామ్’ సరికొత్త హంగులను జోడించింది. ప్రధానంగా వీడియో కమ్యూనికేషన్పై దృష్టి సారించింది. జూన్లోనే గ్రూప్ వీడియో కాల్స్ను ఈ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగస్వాములయ్యేవారి సంఖ్యను తాజాగా వెయ్యి మందికి పెంచింది. దీనివల్ల అంతమంది ఆన్లైన్ ఉపన్యాసాలను వీక్షించొచ్చని తెలిపింది. చిన్న సంస్థలు దీనివల్ల ప్రయోజనం పొందుతాయని పేర్కొంది. గరిష్ఠ వీక్షకుల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోతామని వివరించింది. అయితే వీడియో కాల్ను ప్రసారం చేయగలిగేవారి సంఖ్య 30కే పరిమితమవుతుందని తెలిపింది. వీడియో సందేశాల రిజల్యూషన్నూ టెలిగ్రామ్ పెంచింది. వీటికితోడు వీడియో ప్లేబ్యాక్ స్పీడ్ ఆప్షన్లు, సౌండ్తో కూడిన స్క్రీన్ షేరింగ్ వంటి వెసులుబాట్లనూ అందుబాటులోకి తెచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్