China: చైనాలోనూ పెళ్లికాని ప్రసాదులు..!
భారత్లోనే కాదు.. చైనాలోనూ పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. పెళ్లి ఈడు అమ్మాయిలు తగినంత మంది లేకపోవడం దీనికి ఒక కారణం.
జీవన వ్యయానికి భయపడుతున్న కుర్రకారు
పెళ్లీడు అమ్మాయిల కొరత
బీజింగ్: భారత్లోనే కాదు.. చైనాలోనూ పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. పెళ్లి ఈడు అమ్మాయిలు తగినంత మంది లేకపోవడం దీనికి ఒక కారణం. సంసారాన్ని నెట్టుకురావడానికయ్యే వ్యయానికి భయపడి కుర్రాళ్లు ఇప్పట్లో పెళ్లి జోలికే పోబోమని భీష్మించుకు కూర్చుండడం మరో కారణం. దీంతో ముదురు బెండకాయలూ ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఒకవైపు జననాల రేటు, మరోవైపు పెళ్లిళ్ల సంఖ్యా తగ్గిపోతుండగా వృద్ధుల శాతం మాత్రం పెరుగుతూనే ఉంది. దీంతో మున్ముందు వృద్ధుల ఆలనాపాలనా చూసుకోవడం సమస్యగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గడచిన ఏడేళ్ల నుంచి పెళ్లిళ్ల నమోదులు తగ్గిపోతూ వస్తున్నాయని ‘చైనా ఇయర్ బుక్ 2021’ గణాంకాలు తెలిపాయి. గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో నిరుడు పెళ్లిళ్లు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉందని ‘చైనా డైలీ’ తెలిపింది. అధిక జనాభాను తగ్గించడానికి చైనా ప్రభుత్వం దశాబ్దాలుగా అనుసరిస్తున్న ఏక సంతాన విధానానికి 2016లో స్వస్తి చెప్పి, దంపతులు ఇకపై ఇద్దరు పిల్లలను కనవచ్చని ప్రకటించింది. దానివల్ల ప్రయోజనం కనబడకపోవడంతో ఈ ఏడాది ముగ్గురు పిల్లలకు అనుమతి ఇచ్చింది. యువత అసలు పెళ్లే వద్దంటుంటే ఇక పిల్లల్ని కనే అవకాశం ఎక్కడుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..
ఎందుకీ విముఖత?
ఉద్యోగ, వ్యాపారాల్లో విపరీతమైన ఒత్తిడి, అమ్మాయిలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం, పెరిగిపోయిన జీవన వ్యయం, చుక్కలను తాకుతున్న ఇళ్ల ధరలు, పిల్లలను పెంచి విద్యాబుద్ధులు చెప్పించడానికయ్యే ఖర్చు నానాటికీ పెరిగిపోవడం వంటి కారణాలు యువతలో పెళ్లి పట్ల విముఖత ఏర్పరుస్తున్నాయి. చైనాలో స్త్రీల కన్నా పురుషుల సంఖ్య 3.49 కోట్లు ఎక్కువ. ముఖ్యంగా 20 ఏళ్ల వయోవర్గంలోనైతే స్త్రీలకన్నా పురుషుల సంఖ్య 17.5 కోట్లు ఎక్కువ. 60 ఏళ్లు పైబడినవారు జనాభాలో 18.7% ఉండగా, 2036కల్లా అది 29.1 శాతానికి పెరుగుతుందని చైనా డైలీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
Delhi Commission for Women: దిల్లీ మహిళా కమిషన్లో 223 మంది ఉద్యోగులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వేటు వేశారు. వారిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించారు. -
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
Puducherry: మండుటెండల్లో వాహనదారులకు కాస్త ఉపశమనం కల్పించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ షేడ్ నెట్స్ను ఏర్పాటు చేసింది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి