దిల్లీ నుంచి చండీగఢ్కు లారీలో రాహుల్గాంధీ
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ లారీలో ప్రయాణించి అందరినీ అశ్చర్యపరిచారు. దిల్లీ నుంచి చండీగఢ్ వరకూ 250 కి.మీ.ల మేర ఆయన ప్రయాణం సోమవారం రాత్రంతా సాగింది.
250 కి.మీ. రాత్రంతా ప్రయాణం
డ్రైవర్ల సమస్యలను విన్న నేత
చండీగఢ్, దిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ లారీలో ప్రయాణించి అందరినీ అశ్చర్యపరిచారు. దిల్లీ నుంచి చండీగఢ్ వరకూ 250 కి.మీ.ల మేర ఆయన ప్రయాణం సోమవారం రాత్రంతా సాగింది. శిమ్లాలో విశ్రాంతి తీసుకుంటున్న తన తల్లి సోనియా గాంధీని కలిసేందుకు సోమవారం రాత్రి రాహుల్ బయలు దేరారు. దిల్లీలో ఆయన లారీ ఎక్కారు. డ్రైవరుతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక ధాబా దగ్గర ఆగారు. అక్కడ డ్రైవర్లతో సమావేశమై సమస్యలను విన్నారు. రాహుల్ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను, వివరాలను కాంగ్రెస్ పార్టీ మంగళవారం హిందీలో చేసిన ట్వీట్లో వెల్లడించింది. లారీ డ్రైవర్ల మన్కీ బాత్ను ఆయన విన్నారని పేర్కొంది. ‘రాహుల్ గాంధీ విలక్షణమైన వ్యక్తి. దేశంలో సామాన్యులకు, ప్రభుత్వానికి మధ్య పెరుగుతున్న దూరాన్ని సరిచేసేందుకు ప్రయత్నించారు. అంత వేడిలోనూ ఆయన లారీలో కూర్చుని రాత్రంతా ప్రయాణించారు. డ్రైవర్ల సమస్యలను విన్నారు. వారిలో భవిష్యత్తుపై ఇంకా ఆశ మిగిలే ఉంది’ అని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగాధిపతి సుప్రియా శ్రీనేథ్ పేర్కొన్నారు. చండీగఢ్ జాతీయ రహదారిపై అంబాలాలోని మంజీ సాహిబ్ గురుద్వారావద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు రాహుల్ లారీ దిగారు. గురుద్వారాలోకి వెళ్లి ప్రార్థన చేశారు. అక్కడే లంగర్లో టీ తాగి లారీ ఎక్కి చండీగఢ్కు వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది. -
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
తనపై వచ్చిన ఓ మీమ్ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..