అదిగదిగో జాబిల్లి
కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకుంటూ నింగిలోకి వెళ్లిన చంద్రయాన్-3 వ్యోమనౌక అప్రతిహతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.
విజయవంతంగా చంద్రయాన్-3 టీఎల్ఐ విన్యాసం
5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశం
కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకుంటూ నింగిలోకి వెళ్లిన చంద్రయాన్-3 వ్యోమనౌక అప్రతిహతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఒక్కో దశను అధిగమిస్తూ చందమామ దిశగా అడుగులు వేస్తోంది. 17 రోజుల పాటు భూమి చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఈ వ్యోమనౌక.. ఇప్పుడు కీలకమైన ‘ట్రాన్స్లూనార్ ఇంజెక్షన్’ (టీఎల్ఐ) దశను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఫలితంగా అది భూమికి వీడ్కోలు చెప్పి.. చందమామ దిశగా పయనాన్ని ఆరంభించింది. ఇక జాబిల్లిని చేరుకోవడమే తరవాయి. ఈ నెల 5న అది చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.
చంద్రుడిపైన ల్యాండర్, రోవర్లను దించే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జులై 14న ఎల్వీఎం3 ఎం-4 రాకెట్ సాయంతో చంద్రయాన్-3ను భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నాటి నుంచి శాస్త్రవేత్తలు.. వ్యోమనౌకలోని ఇంజిన్ను నిర్దిష్ట సమయంలో మండించడం ద్వారా దశలవారీగా దీని కక్ష్యను పెంచారు. ఈ విధానంలో వ్యోమనౌక భూగురుత్వాకర్షణ శక్తిని యుక్తిగా ఉపయోగించుకుంటూ వడిసెలా (స్లింగ్షాట్) ముందుకు కదులుతుంది. ఫలితంగా దాని కక్ష్య 1,27,603 కి.మీ ్ల 236 కి.మీ.కి పెరిగింది.
- మంగళవారం చంద్రయాన్-3.. భూమికి చేరువగా ఉండే బిందువు (పెరిజీ)లో ఉన్న సమయంలో శాస్త్రవేత్తలు కీలక కసరత్తు చేపట్టారు. ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ నుంచి ఆదేశాలు పంపి వ్యోమనౌకలోని ఇంజిన్ను 20 నిమిషాలకుపైగా మండించడం ద్వారా టీఎల్ఐ విన్యాసాన్ని నిర్వహించారు. ఫలితంగా ఈ వ్యోమనౌక భూకక్ష్యను వీడి, చందమామను చేరుకునే మార్గం (లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ)లోకి ప్రవేశించింది. ఈ దశలో దాని కక్ష్య 288కి.మ్లీ 3,69,328 కి.మీ.కు పెరిగింది.
తదుపరి ఏమిటి?
లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలో పయనిస్తూ ఈ నెల 5న చందమామకు చంద్రయాన్-3 చేరువవుతుంది. ఆ దశలో వ్యోమనౌకలోని ద్రవ ఇంజిన్ను మరోసారి మండించి, దాన్ని వేగాన్ని తగ్గిస్తారు. ఫలితంగా అది చందమామ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. దీన్ని లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ (ఎల్వోఐ)గా పేర్కొంటారు.
- దీంతో చంద్రయాన్-3లోని ‘మూన్ సెంట్రిక్ దశ’ మొదలవుతుంది. ఆ తర్వాత జాబిల్లి చుట్టూ ఈ వ్యోమనౌక తిరుగుతుంది.
- ఆ దశలో వ్యోమనౌక ఇంజిన్ను దశలవారీగా మండించి, దాని కక్ష్యను తగ్గిస్తారు. క్రమంగా చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకొస్తారు. భూకక్ష్య నుంచి వచ్చాక నేరుగా చందమామపై దిగడం ఈ వ్యోమనౌకకు సాధ్యం కాదు కాబట్టి అత్యంత ఒడుపుగా ఈ విన్యాసాలను నిర్వహించడం చాలా కీలకం.
- ఈ నెల 17న చంద్రయాన్-3లోని ల్యాండర్-రోవర్ మాడ్యూల్.. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి వేరవుతుంది.
- 23న చిట్టచివరి, అత్యంత కీలకమైన ఘట్టం చోటుచేసుకోనుంది. ఆ రోజున ల్యాండర్-రోవర్ మాడ్యూల్కు ఆదేశాలు పంపడం ద్వారా దాన్ని చందమామపై దించుతారు. క్రమపద్ధతిలో వేగాన్ని నియంత్రించుకుంటూ సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో మృదువుగా దిగుతుంది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి, చందమామ ఉపరితలంపై తిరుగుతుంది. ఈ రెండూ 14 రోజులపాటు జాబిల్లిపై పరిశోధనలు సాగిస్తాయి.
పెరిజీలోనే ఈ విన్యాసం ఎందుకు?
ఇప్పటి వరకూ చంద్రయాన్-3.. భూమి చుట్టూ ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమించింది. ఇందులో పుడమికి దగ్గరగా ఉండే బిందువును ‘పెరిజీ’ అని, దూరంగా ఉండే బిందువును ‘అపోజీ’ అని పిలుస్తారు.
- పెరిజీ వద్ద ఉన్నప్పుడు చంద్రయాన్-3 వేగం అత్యధిక స్థాయి (సెకనుకు 10.3 కిలోమీటర్లు)లో, అపోజీ వద్ద తక్కువగా (సెకనుకు కిలోమీటరు) ఉండేది.
- స్లింగ్షాట్ విన్యాసం చేసేటప్పుడు వ్యోమనౌక గరిష్ఠ వేగంతో కదులుతుండాలి. అందువల్ల పెరిజీ వద్దే దీన్ని నిర్వహిస్తారు.
- దీనికితోడు వ్యోమనౌక చంద్రుడి దిశగా పయనించాలంటే తన దృక్కోణాన్నీ మార్చుకోవాల్సి ఉంటుంది. పెరిజీ వద్ద టీఎల్ఐ విన్యాసాన్ని నిర్వహిస్తే అది సులువుగా సాగుతుంది.
- తాజా టీఎల్ఐ విన్యాసం తర్వాత చంద్రయాన్-3 వేగం సెకనుకు సుమారు 0.5 కిలోమీటర్ల మేర పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు