పురుషుడిలా మారిపోతా.. అనుమతివ్వండి
ఓ మహిళా కానిస్టేబుల్ తాను పురుషుడిగా మారిపోయేందుకు లింగమార్పిడికి అనుమతించాలంటూ చేసుకున్న విజ్ఞప్తి ఉత్తర్ప్రదేశ్ డీజీపీ కార్యాలయాన్ని విస్మయానికి గురిచేసింది.
యూపీలో మహిళా కానిస్టేబుల్ వినతి
గోరఖ్పుర్: ఓ మహిళా కానిస్టేబుల్ తాను పురుషుడిగా మారిపోయేందుకు లింగమార్పిడికి అనుమతించాలంటూ చేసుకున్న విజ్ఞప్తి ఉత్తర్ప్రదేశ్ డీజీపీ కార్యాలయాన్ని విస్మయానికి గురిచేసింది. అయోధ్యకు చెందిన ఆ మహిళా కానిస్టేబుల్ 2019లో విధుల్లో చేరారు. ప్రస్తుతం గోరఖ్పుర్లోని స్థానిక నిఘా విభాగంలో పనిచేస్తున్నారు. ఆమె ప్యాంట్, చొక్కా ధరించి.. పురుషుడిలా జుట్టు కత్తిరించుకుని ఆఫీసుకు వెళ్లేవారు. క్రికెట్ ఆడేవారు. తనకు విద్యార్థి దశ నుంచే లింగ అసంతృప్తి ఉండేదని అమె చెబుతున్నారు. పోలీసు శాఖలో చేరాక లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో దిల్లీలోని వైద్యులను సంప్రదించారు. అనంతరం తాను పురుషుడిగా మారేందుకు అనుమతించాలంటూ డీజీపీకి లేఖ రాశారు. అనుమతి నిరాకరిస్తే కోర్టును ఆశ్రయించడానికి కూడా వెనకాడనంటున్నారు. ఈ విషయంపై స్పందించిన డీజీపీ కార్యాలయం.. గోరఖ్పుర్ పోలీసులకు ఓ లేఖ రాసిందని సమాచారం. అందులో ఆ మహిళా కానిస్టేబుల్కు కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారు చీర.. ధర రూ.2.25 లక్షలు
దిల్లీలో జరుగుతున్న 42వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో బంగారు పూత పూసిన ఓ చీర రూ.2.25 లక్షల ధర పలికింది. -
రూ.4.60 లక్షల ధర పలికిన ముర్రాజాతి గేదె
హరియాణాలోని ఝజ్జర్ జిల్లా ఖాన్పుర్కు చెందిన ఓ ముర్రాజాతి గేదె రికార్డుస్థాయిలో రూ.4.60 లక్షలకు అమ్ముడుపోయింది. -
రన్వేపై బారాత్.. విమానంలో వివాహం
యూఏఈకి చెందిన ఓ వ్యాపారవేత్త ఆకాశవీధుల్లో తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. -
మౌలిక వసతుల విస్తరణతోనే అందరికీ చేరువగా న్యాయం
ప్రజానుకూల తీర్పులు ఇవ్వడం ద్వారా మాత్రమే అందరికీ అందుబాటులోకి న్యాయాన్ని తీసుకురాలేమని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. -
నిబంధనలు ఉల్లంఘించే పార్టీల గుర్తింపు రద్దు అధికారం ఈసీకి ఉండాలి
చట్టాలను, నమోదు నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘాని(ఈసీ)కి తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టుకు సమర్పించిన వాదనల్లో పిటిషనర్ గట్టిగా కోరారు. -
గుజరాత్లో అకాల వర్షాలు
గుజరాత్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి. పలు జిల్లాల్లో పిడుగులు పడి 27 మంది మృతి చెందారు. -
36 మీటర్లు పూర్తయిన తవ్వకం
ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న 41 మందిని రక్షించడానికి కొండ పైభాగం నుంచి చేపట్టిన 86 మీటర్ల డ్రిల్లింగ్ పనిలో సోమవారం రాత్రికి 36 మీటర్లు పూర్తయింది. -
మార్చి నాటికి ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం ఖరారు
అమెరికా నుంచి 31 ఎంక్యూ-9బి ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల కొనుగోలుకు ఉద్దేశించిన కీలక ఒప్పందాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి ఖరారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. -
సంక్షిప్త వార్తలు
మహాత్మా గాంధీ గత శతాబ్దంలో మహా పురుషుడైతే, ఈ శతాబ్దంలో ప్రధాని నరేంద్ర మోదీ యుగ పురుషుడని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అభివర్ణించారు. -
Jagdeep Dhankar: గాంధీ మహా పురుషుడు.. మోదీ యుగ పురుషుడు: ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్
ప్రముఖ జైన మత గురువు, ఆధ్యాత్మిక వేత్త శ్రీమద్ రాజ్చంద్రాజీ జయంతి వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
-
Ravi Shastri: 2024 పొట్టి కప్పులో భారత్ గట్టి పోటీదారు: రవిశాస్త్రి
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు
-
సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన చంద్రబాబు దంపతులు
-
ఏపీలో ఎయిర్ఫైబర్ సేవలు విస్తరించిన జియో
-
Ramana Deekshitulu: తిరుమలలో ఆచారాలను నాశనం చేస్తున్న ప్రభుత్వం: రమణ దీక్షితులు