జమిలిపై పార్టీల అభిప్రాయాల సేకరణ
దేశంలో పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు అన్ని స్థాయుల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న యోచనపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది.
లా కమిషన్ నుంచి కూడా
ఉన్నతస్థాయి కమిటీ తొలి భేటీలో నిర్ణయం
ఈనాడు, దిల్లీ: దేశంలో పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు అన్ని స్థాయుల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న యోచనపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంలో సాధ్యాసాధ్యాల అధ్యయనానికి కేంద్రం ఈ నెల 2న కమిటీని నియమించిన విషయం తెలిసిందే. శనివారం దిల్లీలో తొలిసారి సమావేశమైన కమిటీ ఈ అభిప్రాయానికి వచ్చినట్లు కేంద్ర న్యాయశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
విధివిధానాలపై చర్చ
కమిటీ ఛైర్మన్ కోవింద్ సభ్యులకు స్వాగతం పలికి సమావేశ ఎజెండాను, చేయాల్సిన పనిపై విధి విధానాలనూ వివరించారు. జమిలి ఎన్నికల నిర్వహణపై జాతీయ పార్టీలు, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతున్న పార్టీలు, పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, గుర్తింపు పొందిన రాష్ట్రపార్టీలతో పాటు లా కమిషన్ నుంచి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు కోరుతూ ఆహ్వానం పంపాలని సమావేశంలో నిర్ణయించారు. అవసరమైన దస్త్రాల సన్నద్ధత, సంబంధిత పక్షాలతో సంప్రదింపులు ఎలా నిర్వహించాలి? జమిలి ఎన్నికలపై పరిశోధన.. తదితర అంశాలు చర్చకు వచ్చాయి. కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన, అధికారిక సంప్రదింపులు ఎలా జరపాలన్న అంశాలపై కమిటీ చర్చించింది. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్షా, న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, మాజీ సీవీసీ సంజయ్ కొఠారి హాజరయ్యారు. సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కమిటీ నుంచి వైదొలగుతున్నట్లు ఇదివరకే ప్రకటించిన లోక్సభలో కాంగ్రెస్పక్ష నేత అధీర్ రంజన్ చౌధరి ఇందులో పాల్గొనలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదవీ విరమణ వయసులో.. సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ
రాజ్కరణ్ బారువా (56).. మధ్యప్రదేశ్లోని జబల్పుర్ నగరంలో రూ.5 వేల జీతానికి రాత్రంతా సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ, పగలు ఇళ్లలోనూ పనిచేస్తారీయన. ఇలా చాలామంది చేస్తూ ఉండవచ్చు. -
కార్మికుల మనోధైర్యానికి జాతి వందనం
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకొని దాదాపు 17 రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం విజయవంతంగా బయటపడిన 41 మంది కార్మికుల మనోధైర్యానికి జాతి వందనాలు సమర్పిస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. -
పేదలకు అండగా ట్రాన్స్జెండర్
పేద కుటుంబాల అమ్మాయిలకు వివాహం చేయడానికి వారి తల్లిదండ్రులు పడే ఇబ్బందులు అన్నిఇన్నీ కావు. అలాంటి వారి బాధను అర్థం చేసుకున్నారు రాజస్థాన్కు చెందిన ఓ ట్రాన్స్జెండర్. ఏటా 10 మంది పేద కుటుంబాల అమ్మాయిలకు వివాహం చేస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు. -
కేజ్రీవాల్కు గోవా కోర్టు సమన్లు
ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గోవా కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై మపూసా ఫస్ట్క్లాస్ జుడీషియల్ మేజిస్ట్రేట్ జారీచేసిన ఈ సమన్లలో బుధవారం కోర్టు ముందు హాజరు కావలసిందిగా పేర్కొన్నారు. -
శీతాకాల సమావేశాల వేళ.. రాహుల్ మళ్లీ విదేశాలకు
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ గైర్హాజరు కానున్నట్టు సమాచారం. ఈ సమయంలో ఆయన విదేశీ పర్యటనకు వెళుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. -
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు దిల్లీలో ఓటరు కార్డు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మారిన చిరునామాతో కొత్త ఓటరు కార్డును మంగళవారం అందుకున్నారు. దిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి పి.కృష్ణమూర్తి రాష్ట్రపతిభవన్లో ముర్మును కలిసిఈ కార్డును అందజేశారు. -
సీజేఐ కోర్టులో విదేశాల ప్రధాన న్యాయమూర్తులు
సుప్రీంకోర్టులో మంగళవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం భేటీ అయిన కోర్టుకు ఐవరీ కోస్ట్, దక్షిణ సూడాన్, ఘనా, కిర్గిజ్స్థాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, కామెరూన్, బోట్స్వానా దేశాల ప్రధాన న్యాయమూర్తులు విచ్చేశారు. -
ఆంగ్ల భాష, అధిక ఫీజులే సమ న్యాయానికి అడ్డంకి
అత్యున్నత న్యాయ వ్యవస్థలో అధిక ఫీజులు, ఆంగ్ల భాషే సమ న్యాయానికి అడ్డంకిగా నిలుస్తున్నాయని, వాటిని అధిగమించాల్సి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. -
నేవీకి మరో స్వదేశీ విమానవాహక నౌక!
హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళానికి సరికొత్త బలం లభించబోతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రెండో విమానవాహక నౌకను నిర్మించాలన్న నేవీ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించబోతోంది. -
2024 చివర్లోగా ఐఎస్ఎస్లోకి భారత వ్యోమగామి
అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో భారత్కు సాయం చేయడానికి తాము సిద్ధమని అమెరికా రోదసి సంస్థ-నాసా అధిపతి బిల్ నెల్సన్ తెలిపారు. మన దేశంలో పర్యటిస్తున్న ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. -
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు తెలపాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. వివాహ బంధంలో కొనసాగుతున్నా, విడిపోయినా భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు అవకాశం లేదని జస్టిస్ ఎస్.సునీల్దత్ యాదవ్, జస్టిస్ విజయకుమార్ ఏ పాటిల్లతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. -
మృత్యుంజయులు
అందరి ప్రార్థనలు ఫలించాయి. దృఢ సంకల్పంతో దీక్షగా చేపట్టిన సహాయక చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. నేడు, రేపు అంటూ 17 రోజులుగా సొరంగంలోనే గడిపిన 41 మంది ఎట్టకేలకు సురక్షితంగా బయటకు రాగలిగారు. -
నిషేధించిన పనే ఆదుకుంది
ర్యాట్ హోల్ మైనింగ్.. ఉత్తర్కాశీ సొరంగ ప్రమాద ఉదంతంతో రెండ్రోజులుగా ప్రాచుర్యంలోకి వచ్చిన పని ఇది. ఇంతవరకు ఈశాన్య రాష్ట్రాలకు, ప్రధానంగా మేఘాలయకు పరిమితమైన ఈ ప్రక్రియే చార్ధామ్ రహదారి పనుల్లో భాగంగా చిక్కుకుపోయిన కూలీలను బయటకు తెచ్చేందుకు ఉపయోగపడింది. -
Rat hole Miners: ‘మమల్ని గట్టిగా కౌగిలించుకున్నారు.. ఇలాంటిది జీవితంలో ఒకేసారి వస్తుంది’
సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకురావడంపై ర్యాట్ హోల్ మైనర్లు జాతీయ మీడియాతో మాట్లాడారు.


తాజా వార్తలు (Latest News)
-
పదవీ విరమణ వయసులో.. సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ
-
యూపీలో అపహరణ.. హైదరాబాద్లో అత్యాచారం
-
ఏపీకి తుపాను ముప్పు.. డిసెంబరు తొలి వారంలో అతి భారీ వర్షాలు!
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్పై ప్రశాంత్ నీల్ క్లారిటీ