విద్వేష వ్యాఖ్యలపై మౌనమేల?

నూతన పార్లమెంటు భవనంలో అధికార భాజపా విద్వేష సంస్కృతిని ఆవిష్కరించింది.

Updated : 24 Sep 2023 05:50 IST

నూతన పార్లమెంటు భవనంలో అధికార భాజపా విద్వేష సంస్కృతిని ఆవిష్కరించింది. ఆ పార్టీ ఎంపీ రమేశ్‌ బిధూడీ మైనారిటీ వర్గానికి చెందిన బీఎస్పీ సభ్యుడు దానిశ్‌ అలీపై లోక్‌సభ సాక్షిగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఆక్షేపణీయం. అయినా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎందుకు మౌనంగా ఉన్నారు?

కపిల్‌ సిబల్‌


ఆ నిర్ణయం చరిత్రాత్మకం

మహిళల సాధికారత, సమాన భాగస్వామ్యాన్ని సాకారం చేసే మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించడం ద్వారా భారత పార్లమెంటు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ కీలక నిర్ణయం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతంగా, సమ్మిళితంగా తయారు చేస్తుంది. మహిళల భాగస్వామ్యం దేశాభివృద్ధికి కొత్త కోణాలను జోడిస్తుంది.

మోహన్‌ భాగవత్‌


సంపన్నులకే రిపబ్లికన్ల సాయం

అమెరికాలో 2020లో 55 బడా కార్పొరేట్‌ సంస్థలకు ఆదాయ పన్నుకు సంబంధించి పూర్తి మినహాయింపునిచ్చారు. మా ప్రభుత్వం వచ్చాక చేసిన కొత్త చట్టం కారణంగా ఆ సంస్థలు కనీసం 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రిపబ్లికన్లు సంపన్నులకు, కార్పొరేట్లకు పన్నులు తగ్గించారు. మేము ఆ అవసరం ఉన్నవారికి మాత్రమే ఉపశమనం కల్పించాం.

బైడెన్‌


ఉపాధ్యాయులకు శిక్షణ అవసరం

ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించడానికి సుశిక్షుతులైన ఉపాధ్యాయులు మరింత మంది అవసరం. కానీ 17 లక్షల మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఇప్పటికీ సరైన శిక్షణ అందలేదు. ప్రభుత్వాలు దీనిపై దృష్టిపెట్టాలి.

యునెస్కో


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని