భారత్‌కు పెనుశాపంగా నోటి క్యాన్సర్‌

నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్‌లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది.

Published : 05 May 2024 06:24 IST

2022లో 560 కోట్ల డాలర్ల ఉత్పాదకత నష్టం
టాటా మెమోరియల్‌ సెంటర్‌ అధ్యయనం

ముంబయి: నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్‌లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. ఇది దేశ జీడీపీలో 0.18% అని పేర్కొంది. నోటి క్యాన్సర్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో మూడింట రెండొంతులు భారత్‌లోనే ఉన్నాయని తెలిపింది. 2019 నుంచి 2022 మధ్య 36 నెలల కాలంలో క్యాన్సర్‌ చికిత్స పొందిన 100 మంది రోగులను టీఎంసీ అధ్యయనం చేసింది. ఇందులో వెల్లడైన అంశాలివీ..

  • 91% మరణాలు లేదా నయం చేయలేని క్యాన్సర్లు 41.5 ఏళ్ల వయసు వారిలోనే సంభవించాయి.
  • 70% ప్రారంభ దశ, 86% ముదిరిన దశ క్యాన్సర్లు మధ్యతరగతి కుటుంబాల వారిలోనే బయటపడ్డాయి.    
  • అకాల మరణాల కారణంగా కోల్పోయిన ఉత్పాదకతను మానవ మూలధన విధానం ద్వారా లెక్కించారు. ఒక్కో అకాల మరణంతో కోల్పోయిన ఉత్పాదకతను పురుషులైతే రూ.57,22,803, స్త్రీలైతే రూ.71,83,917లుగా గణించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని