పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు.
భారీగా గాలింపు చర్యలు
పలువురి నిర్బంధం
ఐఏఎఫ్ వాహనశ్రేణి దాడిలో గాయపడిన సైనికుల్లో ఒకరి పరిస్థితి విషమం
మేంఢర్/జమ్ము: భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. శనివారం పూంఛ్ జిల్లాలోని సురన్కోట్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో నలుగురు సైనికులకు గాయాలయ్యాయి. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరొక సైనికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి అనంతరం ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోయారని అనుమానిస్తున్నారు. దీంతో షహసితార్, గురుసాయ్, సనాయ్, షీన్దార్ టాప్ ప్రాంతాలను సైన్యం, పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే పలువురిని నిర్బంధించి విచారణ జరుపుతున్నారు. దాడిలో ఉగ్రవాదులు ఏకే 47 రైఫిల్స్తో పాటు, అమెరికా తయారీ ఎం-4 కార్బైన్ను, స్టీల్ తూటాలను వాడినట్లు తెలుస్తోంది. మృతి చెందిన కార్పొరల్ విక్కీ పహాడెకు భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధరీ నివాళి అర్పించారు. దాడిని కాంగ్రెస్ ఖండించింది. 2007-14 మధ్య పూంఛ్ ప్రాంతంలో భారీ ఉగ్రవాద ఘటనలు జరగలేదని, తాజా దాడులు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదాన్ని కట్టడిచేస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి