Train: ఈ రైలు నిమిషాలు, గంటలు కాదు.. ఏడాది ఆలస్యం!
మన దేశంలో రైళ్ల రాకపోకలు ఆలస్యమవడం సాధారణమే. నిర్ణీత సమయం కంటే కొన్ని నిమిషాలు/గంటల తేడాలో అవి గమ్యస్థానానికి చేరుకుంటుంటాయి! అందులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కానీ తాజాగా
మన దేశంలో రైళ్ల రాకపోకలు ఆలస్యమవడం సాధారణమే. నిర్ణీత సమయం కంటే కొన్ని నిమిషాలు/గంటల తేడాలో అవి గమ్యస్థానానికి చేరుకుంటుంటాయి! అందులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కానీ తాజాగా ఝార్ఖండ్లోని తన గమ్యస్థానానికి చేరుకున్న ఓ గూడ్సు రైలు గురించి తెలిస్తే మాత్రం ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే దాని రాక ఏకంగా ఏడాది ఆలస్యమైంది.. ఇది నిజం. 2021 మేలో ఛత్తీస్గఢ్లోని ఓ రైల్వేస్టేషన్లో ఒక రైలు బోగిని వెయ్యి బియ్యం బస్తాలతో నింపారు. 762 కిలోమీటర్లు ప్రయాణించి ఝార్ఖండ్లోని న్యూ గిరిడీ స్టేషన్ను అది చేరుకోవాలి. సాంకేతిక కారణాలతో అది నిర్ణీత సమయానికి ముందుకు కదలలేదు. తర్వాత దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆ బోగితో గూడ్సు రైలు ఎట్టకేలకు ఏడాది ఆలస్యంగా ఈ నెల 17న న్యూ గిరిడీ స్టేషన్ను చేరుకుంది. ఏడాది ఆలస్యం కావడంతో.. 200-300 బస్తాల బియ్యం పాడైపోయిందని అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్