అక్కడ అమ్మవారికి కష్టాలు చెప్పుకొని.. చెప్పులు సమర్పిస్తారు!
ఏదైనా ఆలయానికి వెళితే.. చెప్పులు బయటే విడిచి వెళతాం. కానీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కోలా ప్రాంతంలోని జిజిబాయ్ ఆలయం లేదా పహడా వాలీ మాతా మందిరానికి వెళితే నవరాత్రుల్లో భక్తులే స్వయంగా మాతా రాణి అమ్మవారికి చెప్పులు, బూట్లు వంటివి సమర్పిస్తారు.
నవరాత్రుల్లో భోపాల్లోని ఆలయం ప్రత్యేకత
ఏదైనా ఆలయానికి వెళితే.. చెప్పులు బయటే విడిచి వెళతాం. కానీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కోలా ప్రాంతంలోని జిజిబాయ్ ఆలయం లేదా పహడా వాలీ మాతా మందిరానికి వెళితే నవరాత్రుల్లో భక్తులే స్వయంగా మాతా రాణి అమ్మవారికి చెప్పులు, బూట్లు వంటివి సమర్పిస్తారు. ఇక్కడ కొలువైన అమ్మవారు రాత్రిపూట చెప్పులు ధరిస్తారనేది భక్తుల విశ్వాసం. అంతేకాదు.. అమ్మవారికి చెప్పులు, బూట్లు సమర్పిస్తే ప్రసన్నురాలు అవుతుందని కూడా నమ్ముతారు.
ఇక్కడి ఆలయంలోని అమ్మవారిని భక్తులు కుమార్తెగా భావిస్తారని, అందుకే చెప్పులు, బూట్లతోపాటు టోపీ, కళ్లద్దాలు, వాచీ వంటివి సమర్పిస్తారని పూజారి ఓంప్రకాశ్ మహారాజ్ తెలిపారు. నవరాత్రుల సందర్భంగా విదేశాల నుంచి సైతం భక్తులు అమ్మవారికి చెప్పులు, అలంకరణ సామగ్రి పంపిస్తారని వెల్లడించారు. ఈ సారి సింగపూర్, ప్యారిస్, జర్మనీ, అమెరికా దేశాల్లోని భక్తుల నుంచి అమ్మవారికి చెప్పులు అందాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్