అక్కడ అమ్మవారికి కష్టాలు చెప్పుకొని.. చెప్పులు సమర్పిస్తారు!

ఏదైనా ఆలయానికి వెళితే.. చెప్పులు బయటే విడిచి వెళతాం. కానీ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని కోలా ప్రాంతంలోని జిజిబాయ్‌ ఆలయం లేదా పహడా వాలీ మాతా మందిరానికి వెళితే నవరాత్రుల్లో భక్తులే స్వయంగా మాతా రాణి అమ్మవారికి చెప్పులు, బూట్లు వంటివి సమర్పిస్తారు.

Updated : 03 Oct 2022 08:08 IST

నవరాత్రుల్లో భోపాల్‌లోని ఆలయం ప్రత్యేకత

ఏదైనా ఆలయానికి వెళితే.. చెప్పులు బయటే విడిచి వెళతాం. కానీ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని కోలా ప్రాంతంలోని జిజిబాయ్‌ ఆలయం లేదా పహడా వాలీ మాతా మందిరానికి వెళితే నవరాత్రుల్లో భక్తులే స్వయంగా మాతా రాణి అమ్మవారికి చెప్పులు, బూట్లు వంటివి సమర్పిస్తారు. ఇక్కడ కొలువైన అమ్మవారు రాత్రిపూట చెప్పులు ధరిస్తారనేది భక్తుల విశ్వాసం. అంతేకాదు.. అమ్మవారికి చెప్పులు, బూట్లు సమర్పిస్తే ప్రసన్నురాలు అవుతుందని కూడా నమ్ముతారు.

ఇక్కడి ఆలయంలోని అమ్మవారిని భక్తులు కుమార్తెగా భావిస్తారని, అందుకే చెప్పులు, బూట్లతోపాటు టోపీ, కళ్లద్దాలు, వాచీ వంటివి సమర్పిస్తారని పూజారి ఓంప్రకాశ్‌ మహారాజ్‌ తెలిపారు. నవరాత్రుల సందర్భంగా విదేశాల నుంచి సైతం భక్తులు అమ్మవారికి చెప్పులు, అలంకరణ సామగ్రి పంపిస్తారని   వెల్లడించారు. ఈ సారి సింగపూర్‌, ప్యారిస్‌, జర్మనీ, అమెరికా దేశాల్లోని భక్తుల నుంచి అమ్మవారికి చెప్పులు అందాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని