Chittoor: రూ.కోటి వరించినా.. విధి వంచించింది
వారిది నిరుపేద కుటుంబం. ఇద్దరు కుమారులతో సంతోషంగా జీవిస్తున్నారు. అంతలోనే చిన్న కుమారుడికి ప్రాణాంతక వ్యాధి సోకడంతో వారి కాళ్లకింద భూమి కంపించింది. వీరి గుండెకోతను అర్థం చేసుకున్న దాతలు ఏకంగా రూ.కోటి సాయం చేస్తామన్నారు. బిడ్డను బతికించుకుంటామనే ఆశ చిగురించింది.
చిన్నారికి ప్రాణాంతక వ్యాధి
రూ.కోటి సాయం ప్రకటించిన విద్యాసంస్థ
చికిత్సకు వెళుతూ తల్లిదండ్రుల మృత్యువాత
బెంగళూరు (గ్రామీణం), పాలసముద్రం (చిత్తూరు), న్యూస్టుడే: వారిది నిరుపేద కుటుంబం. ఇద్దరు కుమారులతో సంతోషంగా జీవిస్తున్నారు. అంతలోనే చిన్న కుమారుడికి ప్రాణాంతక వ్యాధి సోకడంతో వారి కాళ్లకింద భూమి కంపించింది. వీరి గుండెకోతను అర్థం చేసుకున్న దాతలు ఏకంగా రూ.కోటి సాయం చేస్తామన్నారు. బిడ్డను బతికించుకుంటామనే ఆశ చిగురించింది. అంతలోనే అనూహ్య ప్రమాదం వారిద్దరినీ కబళించింది. చిన్నారి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇవీ వివరాలు... తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా కళ్లిపట్టుకు చెందిన బాలమురుగన్(45), సెల్వి(36) దంపతులకు ఇద్దరు కుమారులు. వీరి కుటుంబం కూలీ చేసుకుంటూ చాన్నాళ్లుగా బెంగళూరులోనే ఉంటోంది. నాలుగేళ్ల చిన్న కుమారుడికి(పేరు తెలియరాలేదు) ప్రాణాంతక వ్యాధిని గుర్తించారు. చికిత్సకు బెంగళూరులోని ఓ సంస్థ రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ సొమ్ముతో చికిత్స చేయించేందుకు ఆ కుటుంబం సిద్ధమైంది. పెద్దబాబును బెంగళూరు కత్రిగుప్పెలోని తాత వద్ద ఉంచి, శుక్రవారం తమిళనాడులోని స్వగ్రామానికి వచ్చారు. కొంత డబ్బును సమకూర్చుకున్నాక కళ్ల్లిపట్టు నుంచి బంధువులున్న చిత్తూరు జిల్లా బలిజకండ్రిగ చేరుకుని.. ఆదివారం రాత్రి 9.30 గంటలకు కేఎస్ఆర్టీసీ బస్సులో బెంగళూరుకు ప్రయాణమయ్యారు. హొసకోటె మైలాపుర గేటు వద్ద అర్ధరాత్రి వేళ రోడ్డు పక్కన రాళ్ల లోడుతో నిలిపి ఉంచిన లారీని ఆ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బాలమురుగన్, సెల్వి మాంసం ముద్దలుగా మారారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడగా బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వారిలో బాలమురుగన్ కుమారుడు కూడా ఉన్నాడు. అసలే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరాడు. ప్రమాదానికి డ్రైవరు నిర్లక్ష్యమే కారణమని, పరారీలో ఉన్నాడని బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ మలికార్జున బాలదండి తెలిపారు. ఘటనలో చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలవాసులు పలువురికి గాయాలయ్యాయి. సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు మృతదేహాలు కళ్లిపట్టుకు చేరుకోవడంతో ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దులోని ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
-
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం
-
Sita Soren: జేఎంఎంకు షాక్..! భాజపాలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు
-
తెలంగాణ నూతన గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
-
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు