China: ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
చైనా యుద్ధ విమానాలు మరోసారి ఆస్ట్రేలియాను బెదిరించే ప్రయత్నం చేశాయి. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం ముదిరింది.
ఇంటర్నెట్డెస్క్: చైనా(China)-ఆస్ట్రేలియా (Australia)ల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈసారి దీనికి యెల్లో సీ వేదికగా మారింది. ఆస్ట్రేలియా నౌకాదళానికి చెందిన ఓ హెలికాప్టర్పై డ్రాగన్కు చెందిన ఓ యుద్ధ విమానం నిప్పుల వర్షం కురిపించింది. గత వారాంతంలో ఈ ఘటన చోటుచేసుకొన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎంహెచ్-60 హెలికాప్టర్ ఉత్తర కొరియాపై ఐరాస ఆంక్షల అమలు పరిశీలనకు వెళ్లింది. ఆ సమయంలో హఠాత్తుగా దూసుకొచ్చిన చైనా ఫైటర్ జెట్ ఆ హెలికాప్టర్కు అత్యంత సమీపంలో భారీగా ఫ్లేర్స్ను (అగ్ని గోళాలు) విడుదల చేసింది. దీంతో హెలికాప్టర్ సిబ్బంది కంగారుపడ్డారు.
ఈ ఘటనను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బెనీస్ తీవ్రంగా పరిగణించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ‘‘ఆ హెలికాప్టర్ అంతర్జాతీయ జలాలపై ఉన్నాయి. ఉ.కొరియా వద్ద ఐరాస మిషన్పై పని చేస్తోంది. వారు చేసిన పనికి సరైన దౌత్యమార్గాల్లో సమాధానం చెబుతాము’’ అని వ్యాఖ్యానించారు. ఆ దేశ రక్షణ మంత్రి రిచర్చ్ మార్లెస్ మాట్లాడుతూ ఇది సురక్షితం కాని బాధ్యతా రాహిత్య చర్య అని అభివర్ణించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
ఇటీవల అంతర్జాతీయ సముద్ర జలాల్లో జరుగుతున్న ఘర్షణలకు ఇది నిదర్శనంగా నిలిచింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై చైనా వాయుసేన, నావికా దళాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
దీనిపై చైనా సైన్యం స్పందిస్తూ ‘‘ఐరాస ఆంక్షల అమలు పర్యవేక్షణ పేరిట ఆస్ట్రేలియా ఎయిర్ క్రాఫ్ట్ మా గగనతల సరిహద్దులను ఉల్లంఘించి ఇబ్బందులు సృష్టించాలని చూసింది. మేం తగిన చర్యలు తీసుకొన్నాం’’ అని సమర్థించుకొంది. ఎంహెచ్-60 సీహాక్ రెండు ఇంజిన్లతో పనిచేసే హెలికాప్టర్. దీనిలో ముగ్గురు సిబ్బంది ప్రయాణించవచ్చు. హెచ్ఎంఏఎస్ హోబార్ట్ నుంచి దీనిని అంతర్జాతీయ జలాల్లో వినియోగిస్తున్నారు. ఆపరేషన్ ఆర్గోస్లో భాగంగా యెల్లో సీలో ప్రయాణిస్తుండగా ఈ ఘర్షణ చోటుచేసుకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
పంచన్ లామా ఆచూకీని చైనా ప్రకటించాలని అమెరికా మరోసారి డిమాండ్ చేసింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. -
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ భారీ ఉల్క కనువిందు చేసింది. ఇది నేలరాలే సమయంలో వచ్చిన వెలుగుకు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. -
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికలో బరిలో ఉన్న ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. -
రణరంగంగా తైవాన్ పార్లమెంటు
ఓ బిల్లుపై చర్చ సందర్భంగా తైవాన్ పార్లమెంటులో అధికార, విపక్ష ఎంపీలు పరస్పర దాడులకు దిగారు. ఒకరినొకరు ఎత్తిపడేసి.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. -
సింగపూర్లో మళ్లీ కొవిడ్ అలజడి
కొవిడ్-19 మహమ్మారి సింగపూర్లో మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. ఈ నెల 5 నుంచి 11 మధ్య 25,900కుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ తెలిపారు. -
సంక్షిప్త వార్తలు (4)
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళుతున్న మినీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఓ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు సహా 14 మంది మృతి చెందారు. -
కిర్గిజ్స్థాన్లో విదేశీ విద్యార్థులపై మూకదాడులు
కిర్గిజ్స్థాన్లోని భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని బిష్కెక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!