లాలూకు మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్కు సోమవారం సింగపూర్లో మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని ఆయన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తెలిపారు.
తనయుడు తేజస్వీ యాదవ్ వెల్లడి
పట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్కు సోమవారం సింగపూర్లో మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని ఆయన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తెలిపారు. 74 ఏళ్ల లాలూకు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య ఓ మూత్రపిండాన్ని దానం చేశారు. శస్త్రచికిత్స అనంతరం ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తేజస్వీ యాదవ్ సంతోషం వ్యక్తంచేశారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో తన తండ్రిని ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకి మార్చారని వెల్లడించారు. తన తండ్రి, సోదరిల కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో లాలూ ఉన్న వీడియోను ట్వీట్కు జత చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్