బీసీలపై దౌర్జన్యాలు తగవు: ద్రావిడ దేశం
కొందరు తమ అధికార బలంతో ఇటీవల బీసీలపై దాడులు చేస్తున్నారని, వాటిని ఖండిస్తున్నామని ద్రావిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు తెలిపారు.
చెన్నై (సాంస్కృతికం), న్యూస్టుడే: కొందరు తమ అధికార బలంతో ఇటీవల బీసీలపై దాడులు చేస్తున్నారని, వాటిని ఖండిస్తున్నామని ద్రావిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు చెన్నైలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం హైకోర్టు ఉత్తర్వుల మేరకు చిత్తూరు జిల్లాలోని సదుంలో తలపెట్టిన రైతుభేరి కార్యక్రమాన్ని పోలీసుల అనుమతి లేదనే కారణంతో ఆపారని గుర్తుచేశారు. కార్యక్రమం నిర్వహించాలనుకున్న రామచంద్రయాదవ్ ఇంటిపై పోలీసుల కనుసన్నలలోనే కొందరు దాడి చేసి ఆస్తి నష్టం కలిగించారని చెప్పారు. ఓవైపు బీసీలు రాష్ట్రాలకు వెన్నెముక లాంటివారు అని పొగుడుతూ మరోవైపు వారిని అణచివేసేందుకు ఇలా చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?