MSP: చెరకు రైతులకు తీపి కబురు.. గోధుమలపైనా మద్దతు ధర పెంపు
చెరకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. చెరకు పంట ఎఫ్ఆర్పీ ధరను పెంచింది. దీంతో పాటు గోధుమలు, ఆవాలు సహ ఆరు రకాల రబీ
దిల్లీ: చెరకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. చెరకు పంట ఎఫ్ఆర్పీ ధరను పెంచింది. దీంతో పాటు గోధుమలు, ఆవాలు సహ ఆరు రకాల రబీ పంటలకు కూడా మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది.
చెరకు పంటపై ఎఫ్ఆర్పీ ధరను రూ.5 పెంచింది. వచ్చే ఏడాది మార్కెట్ సీజన్లో దీంతో క్వింటాల్ చెరకును క్వింటాల్కు రూ.290 చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీని వల్ల దాదాపు 5కోట్ల చెరకు రైతులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
ఇక 2022-23 మార్కెట్ సీజన్కు గానూ ఆరను రబీ పంటల మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గోధుమలపై ఎంఎస్పీ ధర రూ.40 పెంచింది. ప్రస్తుత మార్కెట్ సీజన్లో క్వింటాల్ గోధుమలు రూ.1975 పలుకుతుండగా.. దాన్ని రూ.2015కు పెంచింది. ఇక బార్లీపై రూ.35 పెంచి క్వింటాల్ ధరను రూ.1635గా నిర్ణయించింది. ఆవాలు, మసూర్ దాల్పై అత్యధికంగా రూ.400 పెంచారు. దీంతో క్వింటాల్ ఆవాలు కనీస మద్దతు ధర రూ.5050, క్వింటాల్ మసూర్ ధర రూ.5500కు చేరింది. శనిగల మద్దతు ధరను రూ. 130 పెంచి క్వింటాల్ ధర రూ.5230, పొద్దుతిరుగుడు ధరను రూ.114 పెంచి క్వింటాల్ ధరను రూ.5441గా నిర్ణయించినట్లు కేంద్ర కేబినెట్ నేడు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?